ఇది పరీక్షా సమయం
''విద్యాతురాణాం నసుఖం న నిద్రా
కవర్ స్టోరీ అర్థాతురాణాం నబంధు: న మిత్ర:
కవర్ స్టోరీ క్షుధా తురాణాం న రుచి: న పక్వం
కవర్ స్టోరీ కామా తురాణాం న భయం న లజ్జా''
అనే 'సుశ్లోకం' ఆశా, ప్రలోభ, వాసనా బద్ధులైన మానవాళికి కనువిప్పు కలిగించడానికే, 'గంటా' పథంగా వెలువడి వుంటుంది. అలనాటి గురుశిష్య పరంపరల బోధనా సాధనలలోనైనా, నేటి పాఠశాలా, కళాశాలా, విశ్వవిద్యాలయాల విద్యాభ్యాసాలలోనైనా, విద్యార్థులకి అగ్ని పరీక్షా సమయాలు అనివార్యమైపోయాయి. అప్పటి చతుర్వేద వేదాంగ పారంగతులకీ, సకలశస్త్రాస్రవిద్యా ప్రపూర్ణులకీ, సమస్త వృత్తి విద్యా నిపుణులకికూడా పరీక్షలలో నెగ్గుకురావడం అసిధారావ్రత సదృశమే. ఇప్పటి, 'మార్క్స్ ఎఛీవింగ్', 'ర్యాంక్స్ ఓరియంటెడ్ మెరిట్ సిస్టమ్'లో కూడా, విద్యార్థులు పోటాపోటీల మీద, అహోరాత్రాలూ పుస్తకాల పురుగులైపోయి, మస్తకాలని కుమ్మరిపురుగుల్లా దొలిచేసే, పొందికా పొంతనా లేని పాఠ్యాంశాల (కోర్సెస్) 'సిలబీ'లని వంటపట్టించుకుకోలేక, బుర్రలకెక్కించుకోలేక సతమతమైపోతూనే వున్నారు. మానసిక ఒత్తిడులని (స్ట్రెసెస్)నీ, మెంటల్ డిప్రెషన్స్నీ తట్టుకోలేక, ఆత్మ హత్యల లాంటి అఘాయిత్యాలకి పాల్పడి, కన్న కడుపులలో చిచ్చు పెడుతూనే వున్నారు. చివరికి జీవచ్ఛవాలుగానో, విగత జీవులుగానో మారిపోయి, తమ మీద గంపెడాశలు పెట్టుకున్న వాళ్ల అతుకుల బతుకులని శాశ్వతంగా సజీవ సమాధి చెయ్యడమో, చితిమంటలలో బుగ్గిపాలు కానివ్వడమో, పర్యవసానాలుగా, పరిణమింపజేస్తున్నారు. ఇంతకీ పరీక్షల పేరుతో, నైట్ అవుట్ స్టడీస్ నెపంతో, రాత్రంతా జారగణ చేసి, మోయలేని పుస్తకాల దొంతరలతో నడుము వంగిపోయి, ఇంటికి తిరిగొస్తూ, నడిరోడ్డు మీద మండుటెండలలో శేషవచ్చి, వడగొట్టి పడిపోయే పసికందులని, అటు టీచర్లనే 'డర్టీ క్రీచర్స్', ఇటు పేరెంట్స్ అనే 'వల్చర్స్' అదే పనిగా పీడిస్తూ, పీల్చి పిప్పిచేస్తుంటే తట్టుకుని, బతికి బట్టకట్టగలరా, ఆ అర్భకులు?
కవర్ స్టోరీ భారత దేశమంతటా, రాష్ట్రానికో విద్యావిధానంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్తో, విద్యార్థులకి ఎడతెరపి లేకుండా చేసి, వాళ్ల లేలేత మనసులనీ, సున్నితమైన శరీరాలనీ, ఎందుకూ పనికిరాకుండా చెయ్యడమే, మన విద్యావిధాన పరమావధి అనిపిస్తోంది.
విద్యావ్యాపారంలో...
ఇక, రిలయన్స్ గ్రూప్, బిర్లాకాంగ్లొమెరేట్ లాంటి కార్పొరేట్స్ కూడా, చిన్న తరహా ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీకి దిగుతున్నాయంటే, ఆయిల్ రిఫైనరీస్ కన్నా, టెక్స్టైల్స్ కన్నా, టెలికామ్ వాణిజ్య సరళికన్నా విద్యా వ్యాపారం, ఈ దేశంలో ఎంత లాభసాటిగా కొనసాగుతుందో వూహించుకోవచ్చు.
ఈ భారీ పారిశ్రామికులూ, వాణిజ్య వేత్తలూ, తమ తమ విద్యా సంస్థలనే ఫ్యాక్టరీలలో, మెరిటో రియస్ స్టూడెంట్స్నే ఇండిజినస్గా 'మాన్యుపాక్చర్' చేసి, ఔట్ సోర్సింగ్స్ ద్వారా విదేశాలకి ఎగుమతి చెయ్యాలనుకోవడంలో వింతేమీ లేదుగా?
ప్రీకేజీ, ఎల్కేజీలలో కూడా...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పాఠశాలలో, కళాశాలలలో, విద్యాప్రమాణాలు బాగా దిగజారిపోయాయన్న అపోహలతో, తల్లిదండ్రులు, తలకి మించిన భారమైనా, తలలూ, తాళిబొట్టులూ, తాకట్టుపెట్టయినా, తమ పిల్లా పాపలనీ, వంశోద్ధారకులనీ ప్రైవేటు విద్యాసంస్థలలో చదివించాలనే వుబలాటపడుతున్నారు. నిజానికీనాడీ దేశంలో, ప్రొఫెషనల్ కోర్సెస్ సీట్స్ కంటే, లక్షలు పోసినా, ఎల్.కె.జీ, యూ.కె.జీ సీట్స్ దొరకడమే గగనంగా వుంది. వాళ్లకి పెట్టే పరీక్షలూ, కట్టబెట్టే ప్రాజెక్ట్వర్క్స్, పి.హెచ్డి ధీసిస్ల స్థాయిలని దాటిపోతున్నాయేమోననిపిస్తోంది మరి!
అసలు ఈ స్థాయిలలో పిల్లలకి అంతలేసి డబ్బుఖర్చుపెట్టి చదివించడం అవసరమా? కావచ్చు, కాకపోవచ్చు. కాని, హైసొసైటీ ఫ్యామిలీస్తో, ఎఫ్లూయెంట్ కుటుంబాలతో సరితూగాలనుకునే, మధ్య తరగతి ప్రజలూ, నిరుపేదజనం కూడా, 'ఫాల్స్ స్టేటస్ సింబల్' మానియాలలో పడి 'పోతు'న్నారనేది నిర్వివాదాంశం. పరీక్షలలో వాళ్లకి వచ్చిన మార్క్స్, ర్యాంక్స్ చూసి ముచ్చటపడి, మురిసిపోయి, సాటివారిలో సగర్వంగా తమ పిల్లల ప్రతాపం గురించి చెప్పుకోవాలనే, అమాయకంగా అగుపించే, గడుసు తల్లిదండ్రులని నిందించి ఏంప్రయోజనం?
విదేశీ సంస్థలు కూడా...
భారతదేశం ఏనాడో ఆటో మొబైల్ హబ్గా మారిపోయి, అలనాటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కన్న కలలని సాకారం చేస్తోంది. అలా, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలోనేకాక, విద్యావ్యవస్థలో కూడా, ఇండియా 'ఎడ్యుకేషనల్ హబ్'గా పరిణమించే సమయం ఆసన్నమైంది.
అంచేతే, కిండర్గార్డెన్ స్థాయిల నుంచి, డాక్టొరల్ డిసర్టేషన్స్ లెవెల్స్ దాకా, ఫారిన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, భారతదేశంలో భారీ ఎత్తున ప్రవేశిస్తున్నాయి. భారతదేశంలో, ఎడ్యుకేషనల్ బిజినెస్కి మంచి గిరాకీ వుందని తెలుసుకున్న విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా, రకరకాల విద్యాప్రణాళికలతో రంగప్రవేశం చేస్తున్నాయి.
అంటే, ప్రభుత్వరంగ విద్యాసంస్థలకి పైచెయ్యిగా, దేశీయం ప్రైవేటు విద్యాసంస్థలూ, వీటిని తలదన్నాలనుకునే కార్పరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటినీ అధిగమించాలనుకునే మల్టీ నేషనల్ ఎడ్యుకేషనల్ ఫ్రాంఛైజెస్, పరస్పరం పోటీపడుతున్నాయి. చివరికీ విద్యావ్యాపార విషయవలయాలలో చిక్కుకుని, బక్కచిక్కిపోయే వాళ్లు, అమాయకులైన విద్యార్థులే మరి!
అలాగైనా, వాళ్ల ధ్యాస అంతా, విద్యమీద నిలబడే ప్రశాంత వాతావరణం ఈ సమాజంలో, దేశంలో వుందా? అదీ సందేహాస్పదమే మరి!
సరే మరి! తమ తమస్వప్రయోజనాల కోసం, విద్యార్థులని పావులుగా వాడుకుని, ప్రాంతీయ విభేదాల, విషబీజాలు వాళ్లలో బలంగానాటి, నవయువరక్తంతో కుతకుత లాడిపోయే వాళ్ల బలహీనతలని ఆసరాగా తీసుకుని, ఉద్యమాల పేరిట బలిపశువులుని చేస్తూ, 'ఆత్మహత్యలకి గురిచేస్తున్న కుహనా రాజకీయవాదులు, కళ్లముందే నిరర్థకంగా కరిగిపోతున్న వాళ్ల విద్యా సంవత్సరాలనీ, కాలగతినీ మార్చి వెనక్కితీసుకురాగలరా? 'కోర్సెస్' కూడా పూర్తికాని పరిస్థితులలో, పరీక్షల పెనుభూతాలు ఎప్పుడు తనుని కబళిస్తాయో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకి 'అభయం' ఇచ్చి ఆదుకోగలరా? చదువులేవో వెలగబెట్టి, వాళ్లు తమని వుద్ధరిస్తారనుకునే వాళ్ల తల్లిదండ్రుల కట్టెదుటే పేకమేడలలా కూలిపోతున్న ఆశా సౌధాలని నిలబెట్టగలరా? ప్రభుత్వం, పోలీసుబలగాలూ, వాళ్లమీద మోపిన క్రిమినల్ కేసుల పర్యవసానంగా, లక్షలాది విద్యార్థుల కాండక్ట్ సర్టిఫికేట్స్ మీద 'బ్లాక్ మార్క్స్' పడితే, తమ పలుకుబడితో, వాటిని సునాయసంగా తుడిచెయ్యగలరా?
సామాజిక, ఆర్థిక వ్యవస్థతో బాటు, నానాటికీ పతనమైపోతున్న విద్యార్థుల నైతిక విలువలనీ, మానసిక ధైర్య, స్థైర్యాలనీ, తమ చేతులలోని యంత్రాంగాల మంత్రదండాల, మహేంద్రజాలాలతో పునర్వ్యవస్థీకరించగలరా?
అసలు, పరీక్షలంటూ జరిగితేగా వాళ్లు పై మెట్టు కెక్కగలిగేది? స్వచ్ఛందంగా కొందరు పరీక్షలు బహిష్కరిస్తుంటే, సానుకూల పరిస్థితులు లేవనీ, శాంతియుత వాతావరణం నెలగొనలేదనీ, బోర్డ్స్తో బాటు, విశ్వవిద్యాలయాలు కూడా, పరీక్షలని నిరవధికంగా వాయిదా వేస్తూపోతుంటే, చివరికి ఏమవుతుంది వాళ్ల విద్యాజీవన భవితవ్యం?
ఏదేమైనా, ఎప్పటికయినా, అన్ని స్థాయిలలోని విద్యార్థులూ పరీక్షలు రాసి, మంచి మార్కులూ, ర్యాంకులూ తెచ్చుకుని, తమ భవిష్యత్తునే ముళ్లబాటలో, అగమ్యంకేసి అనంత పయనం కొనసాగించాల్సిందే! కనుక, వాళ్లు ఆహార, విహారాల విషయంలో తగినంతగా, వీలైనంతగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి మరి!
ఆహారపానీయాలలో...
అందరి జీవితాలూ, ఆరోగ్యంగా కొనసాగడానికి, సరైన సక్రమమైన ఆహారపానీయాలు అనవసరమే. ముఖ్యంగా మెదడులోని జ్ఞాపక శక్తిని ఇనుమడింపజేసుకోవాల్సిన విద్యార్థులు విటమిన్ బి12, విటమిన్ బి6, విటమిన్సి, విటమిన్ ఇ లు మాత్రమేకాక, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బీటాకాటరోన్స్ పుష్కలంగా వున్న ఆహార పానీయాలు సేవించాలి. అలా, ఇవన్నీ సమృద్ధంగా వున్న తినుబండారాలు, మెదడునీ జ్ఞాపకశక్తినీ, ఇనుమడింపజేస్తాయి. 2000 కెలోరీస్ ఆహారానికి అనుగుణంగా పొందుపరచిన వివరాలివి.
1. పాలు: పాలలో, విటమిన్ బి6 5 శాతం, విటమిన్ బి12 15 శాతం, కాల్షియం 28 శాతం, మెగ్నీషియం 65 శాతం, పొటాషియం 11 శాతం వుంటాయి.
2. స్పినాచ్: స్పినాచ్లో, విటమిన్ బి6 11 శాతం, విటమిన్ 2 5 శాతం, ఫోలేట్ 33 శాతం, కాల్షియం 12 శాతం, మెగ్నీషియం 20 శాతం, పొటాషియం 12 శాతం వుంటాయి.
తతిమా ఆహార పదార్థాలలో, యాంధోసయనిన్స్, ఫార్మిడబుల్ యాంటీ ఆక్సిడెంట్స్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, జంబూఫలం అంటే జామపండు కూడా ముఖ్యమైనవే.
3. బ్లాక్ ఐడ్ బీన్స్ (పీస్)
విటమిన్ బి6 3 శాతం, ఫోలేట్ 26 శాతం, కాల్షియం 11 శాతం, మెగ్నీషియం 11 శాతం, పొటాషియం 10 శాతం పుష్కలంగా వుండే దినుసులలో బ్లాక్ ఐడ్ బీన్స్లో కూడా చేకూరుతాయి.
4. ఎకార్న్ స్క్వాష్
ఇందులో, విటమిన్ బి6 12 శాతం, ఫోలేట్ 6 శాతం, కాల్షియం 6 శాతం, మెగ్నీషియం 13 శాతం, పొటాషియం 16 శాతం వుంటాయి.
5. కిడ్నీ బీన్స్
వీటిలో విటమిన్ బి 6 6 శాతం, ఫోలేట్ 29 శాతం, కాల్షియం 3 శాతం, మెగ్నీషియం 10 శాతం, పొటాషియం 10 శాతం వుంటాయి.
6. ఆరెంజ్ జ్యూస్ (కాల్షియం ఫోర్టిఫైడ్) 3/4 కప్పు
ఇందులో విటమిన్ బి6 5 శాతం, విటమిన్ సి 103 శాతం, ఫోలేట్ 8 శాతం, కాల్షియం 23 శాతం, మెగ్నీషియం 5 శాతం, పొటాషియం 11 శాతం వుంటాయి.
ఇక 7. పింక్ సాల్మన్, 8. బొప్పాయి, 9, బ్లాక్చాయ్, 10. బంగాళాదుంపలు, 11. బ్రోకోలీ, 12. వీట్ జెర్మ్, 13. వెజిటబుల్ జ్యూస్, 14. అరటిపళ్లూ, 15. తోఫూ, 16. తేనె, 17. పుష్కలంగా మంచినీరు కూడా విద్యార్థుల మెదడులకి పదును పెట్టే ఆహార పానీయాలే.
కనుక పరీక్షలలో చురుగ్గా,కులాసాగా వుండడానికి తీసుకోవాల్సిన ఆహారం విషయంలో కూడా కొన్ని చిట్కాలు చెప్పారు మన డైటీషియన్స్.
పరీక్షార్థుల ఆహారానికి పది చిట్కాలు:
1. సుళువుగా జీర్ణమయ్యే ఆహారపదా ర్థాలు తీసుకుంటే శరీరం,మనసూ కూడా చలాకీగా వుంటాయి. బాగా చదువుకోవడానికీ, ఏకాగ్రత కుదరడానికీ, శారీరక, మానసిక శక్తి ఎంతో అవసరం. ఆ రెండూ సమకూర్చేవి ఇనుమూ, బి-విటమిన్లే. రెడ్మీట్, సిరియల్స్, స్పెనాచ్లాంటివి ఈ కోవలోకే వస్తాయి. చిల్లీస్తోబాటు బీఫ్, కిడ్నీ బీన్స్ తీసుకోవడం కూడా ఎంతో మేలు చేస్తుంది. బి-విటమిన్ కోసం పపðదినుసులూ, గోధుమ మొలకలూ, కోడిగుడ్డూ, గింజలూ తినడం మంచిది. మెదడు చురుగ్గా వుండాలంటే, చేపలూ, సోయా ఎంతో ఉపకరిస్తాయి.
2. నమలగలిగే సి - విటమిన్:
నారింజ తొనలూ, బత్తాయి తొనలూ, కమలాపళ్ల తొనలూ నోట్లో పెట్టుకోంగానే కరిగిపోయేలా వుంటాయి. వాటిలో సి- విటమిన్ మాత్రమే కాక, పీచు పదార్థం (ఫైబర్), ఫైటో కెమికల్స్, బీటా కెరోటిన్, తదితర ఖనిజ లవణాలూ, ఈ పళ్లలో పుష్కలంగా వుంటాయి. ఒకవేళ సమయానికి ఈ పళ్లు దొరక్కపోతే, సి- విటమిన్ పిల్స్ వేసుకోవడం కూడా మంచిదే. లైబ్రరీకి వెళ్లే ముందు, ఆపిల్స్, అరటిపళ్లు, క్లెమెంటైన్స్, కేరెట్ స్టిక్స, డ్రైడ్ యాప్రికాడ్స్ వంటివి కూడా తీసుకువెళితే చదివి, చదివి బుర్ర వేడెక్కిపోయి నీరసం వచ్చిన సమయంలో నోటికి పని చెప్పవచ్చు.
3. క్రమపద్ధతిలో:
పరీక్షలకోసం చదివే వాళ్లకి శారీరకంగా వ్యాయామం చేసే సమయం దొరకదు కనుక సుళువుగా హరించుకోగలిగే ఆహారం తీసుకోవడమే మంచిది. కాకపోతే కెలరీస్లేని స్నాక్స లాంటివి తింటే తాత్కాలికంగా కడుపు నిండినట్లు అనిపించినా, కాసేపట్లో కడుపులో ఎలకలుపరుగెడతాయి.
4. ఎంతగా చదువులో మునిగిపోయినా, ఉదయం,మధ్యాహ్నం, రాత్రి సకాలంలో తగినంత ఆహారం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగి, మెదడు చురుగ్గా వుంటుంది. అలా కుదరకపోతే పుస్తకంతోపాటు, కాసిన్ని తినుబండా రాలు కూడా పక్కన బెట్టుకొని కనీసం 5,6 సార్లు ఆరారగా టీనట్, బట్టర్ టోస్ట్, పళ్లతోబాటు ఒక చిన్న చీజ్ ముక్క తినడం కూడా ఎంతో మేలు చేస్తుంది. 5. కాఫీ తాగడం:
అతిగా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరమే. అయినా మగతగా, మందంగా, ఉందనిపించినపðడు ఓ కపð బ్లాక కాఫీ తాగడంలో తపðలేదు. దాంతోబాటు మిల్క్తో సిరియల్, ఒక పండుముక్క తీసుకుంటే ఎంతో హాయిగా వుంటుంది.
6. అరటిపళ్లయితే:
అరటిపళ్లు, బ్లూబెర్రీస్, మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కనుక వాటిని ఎంతగా తిన్నా హానికల్గదు. పైగా అరటిపళ్లలో ఉండే నాచురల్ సుగర్ ఎంతో శక్తిని సమకూరుస్తుంది. మొత్తంమీద ఫలాహారం పరీక్షలు రాయబోయేవారికి ఎంతో మేలు చేస్తుంది.
7. కాయగూరలతో:
కాయగూరలన్నీ ఒకేలా వుండవు. ముదురు రంగులో వుండే వంకాయలూ, బీరకాయలూ, అరటికాయల వంటి కాయగూరలు సుళువుగా జీర్ణమవుతాయి. చిలగడదుంపలు కూడా వెనువెంటనే శక్తిని సమకూర్చే ఆహారాలే!
8. నాజూకైన తినుబండారాలు:
తినుబండారాలు నాజూకుగా వున్నంత మాత్రాన వాటిలో పోషక పదార్థాలు వుండవని ఎవరూ చెప్పలేరు. కనుక నాజూకైన ఆహార పదార్థాలు సేవించినా, వాటిలోని పోషక పదార్థాలు నిస్సంశయంగా పరీక్షార్థుల జ్ఞాపకశక్తిని పెంచి తీరుతాయి.
9. శుభ్రమైన ఆహారంతో...
పరీక్షల సమయంలో పిల్లలకీ, నవయువకులైన విద్యార్థులకి కూడా సాయంగా ఎవరైనా వుండి, సకాలంలో ఆహారం అందజేస్తే, వాళ్ల ఏకాగ్రతకి భంగం వాటిల్లకుండా వుంటుంది. పైపెచ్చు వాళ్లు తినుబండారాలు బయటనుంచి తెచ్చుకోవడానికి కూడా సమయం వృధా చేయాల్సిన అవసరం రాదు. వయస్సులో వున్న వాళ్లకీ, వృద్ధులకీ జిహ్వ చాపల్యం ఎక్కువ గనుక వాళ్లు అడపాదడపా తినాలని వెూజుపడే పదార్థాలు తిననీయకుండా ఆంక్షలు విధిస్తే వాళ్ల దృష్టంతా, వాళ్లకిష్టమైన తిండిమీదే వుంటుంది. కనుక విద్యార్థుల మానసిక వికాసాన్నికూడా పరిగణిస్తూ, వాళ్లకి కోరుకున్న ఆహారపదార్థాలు అందజేయడమే మేలు.
10. చదువుతున్న సమయంలో మెదడు చురుకుగా పనిచేయడంతో శరీరంలోని నీరంతా హరించుకుపోతుంది. కనుక, మాటిమాటికీ తగినంత నీరు తాగడం కూడా ఎంతో అవసరం. మొత్తం మీద రోజుకి 400 నుంచి 450 గ్రాముల కెఫైన్వున్న కాఫీ సేవిస్తే, డీహైడ్రేషన్ పరీక్షలు రాసేవాళ్ల జోలికి రాదు. కాఫీ మాత్రమే కాక, తరచుగా మంచినీరూ, పళ్లరసం, పాలూ తాగడం కూడా ఎంతో ఉత్తమం.
పరీక్షలలో మానసిక ఒత్తిడి:
మామూలుగా మానసికంగా పరిపక్వత సంతరించుకున్న పెద్దవాళ్లే దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలతో, ఎంతో మానసికమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ఇక, లేత మనసుల లేలేత వయసుల నాజూకైన మెదడుల బాలబాలికలూ, యువతీ యువకులూ తమ జీవిత గమ్యాన్ని నిర్ణయించే పరీక్షల విషయంలో ఎంతగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారో ఊహించుకోగలం, కనుక, మెంటల్ స్ట్రెస్ నివారించడానికి కూడా మానసిక శాస్త్ర వేత్తలు కొన్ని చిట్కాలు చెప్పారు.
ఎగ్జామ్స్ స్ట్రెస్ నివారణకి పది చిట్కాలు:
1. స్ట్రెస్ నిజంగా పరీక్షలలో ఎంతో సహాయం చేస్తుందంటే ఆశ్చర్యంగా వుంది కదూ! అయినా ఇది అక్షరాలా నిజం. కనుక, స్ట్రెస్తో స్నేహం చేయండి. జీవితంలో ఏదో రూపంలో స్ట్రెస్కి లోనుకానివాళ్లు ఎవరూ ఉండరు కనుక, స్ట్రెస్ని ఒక పెనుభూతంలా పరిగణించేకంటే స్నేహితునిగా చేరదీయడమే మంచిది.
2. పరీక్షల భయం:
అసలు అంతర్గతంగా మనసులో ఆవరించిన భయం వల్లే మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఆ భయాలు తొలగిపోవాలంటే అసలు దేనివల్ల పిల్లలు భయానికి లోనవుతున్నారో తెలుసుకోవాలి. వాళ్లలో పరీక్షలలో నెగ్గలేమనీ, ర్యాంకులూ, మార్కులూ కావలసిన స్థాయిలో సంతరించుకోలేమనే భావన వుంటే దాన్ని తొలగించడానికి వాళ్లతో కాసేపు పిచ్చాపాటీగా మాట్లాడుతూ, 'పరీక్షలు నువ్వు రాయక ఎవరు రాస్తారు నీకు నిజంగా మంచి మార్కులొస్తాయి. బెంగపడకు' అని భుజం తట్టి చెబితే వాళ్లలో అవలీలగా ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది.
3. సక్రమమైన ప్రణాళికతో:
అసలు పరీక్షలు రేపనగా, నైట్అవుట్స్ చేసి నిద్రాహారాలు మానుకొని, సరిగా పరీక్ష రాసే సమయంలో హాల్లో ఆదమరచి కునుకు తీసే దుస్థితి పగవాడికి కూడా రాకూడదు. ముందుగా పరీక్షల గురించి సక్రమమైన ప్రణాళికా, పథకం, టైంటేబుల్ రూపొందించుకొని, వీక అనిపించిన పాఠ్యాంశాలమీద ఎక్కువగా దృష్టి సారిస్తూ, చదవడం, ఎంతో మేలు. అంతేకాక పరీక్షల సమయంలో రాత్రిపూట తగినంతగా నిద్రపోవడం కూడా అవసరమే.
4. రేపటికి వాయిదా వేస్తూ...
ఏ పాఠ్యాంశాలనీ రేపు చదువుదామని వాయిదావేయకుండా వీలైనంతవరకూ సబ్జెక్స్టనిఆకళించుకునే విధంగా యథా లాపంగా చదవడం మంచిది. అంతేకానీ, కంఠతాపట్టడం, బట్టీలు పట్టడం ఎంతో ప్రమాదకరం.
కాకపోతే, ఈ రోజుపని ఈ రోజే పూర్తి చేయడానికి ఎంతో సమర్థతా, సహనం, చాకచక్యం అవసరం. కొందరు పిల్లల్లో అది సహజంగానే వుంటుంది. అది వంశపారంపర్యంగా జీన్స్తో వస్తుందన్నా ఆశ్చర్యంలేదు. అలా రానివాళ్లు సాటివాళ్లని చూసి అలవర్చుకోవడంలో తప్పేమీలేదు.
5. విరామాలతో...
ఎపðడూ పుస్తకం ముందరేసుకొని కూచోడం వల్ల ఎలాంటి లాభమూ వుండదు. కాసేపు చదువుకున్న తర్వాత, కొంతసేపు హాయిగా గాలిలో తిరిగివచ్చి, కాళ్లూ చేతులూ, కళ్లూ చల్లని నీళ్లతో కడుగుకొని, మళ్లీ చదువు మొదలుపెట్టడం ఎంతో మంచిది.
వీలైనంతవరకూ హెర్బల్ టీలూ, నీరూ, రసాలూ తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం కాసేపు సరదాగా పార్కులో తిరిగిరావడం, ఓ గంటసేపు ఈత కొట్టడం, అపðడపðడూ స్నేహితులతో పదినిమిషాలకంటే మించకుండా ఫోన్లో మాట్లాడడం లాంటివి బ్రెయిన్ని రీఛార్జ్ చేయడానికి ఎంతగానో ఉపకరిస్తాయి.
6. సపోర్ట్ సర్వీసెస్తో...
యూనివర్శిటీలు అందించే కౌన్సిలింగ్లాంటి సపోర్టింగ్ సర్వీసెస్ సక్రమంగావిని యోగించుకుంటే పరీక్షల సమయంలో విద్యార్థులు పడే మానసికమైన బాధ కొంతవరకూ ఉపశమిస్తుంది.
7. ఆత్రుత లేకుండా...
విద్యార్థులు శాయశక్తులా చదవగలి గిందంతా చదువుతారు. రాయగలిగిన మేరకు ఖచ్చితంగా రాసితీరతారు. ఇక ఫలితాలు కేవలం వాళ్ల సామర్థ్యం మీదే కాక ఆ మూడు గంటల సమయంలో మెదడుకి తట్టిన అంశాలమీద ఆధారపడి వుంటుందని మరచిపోకూడదు. అంచేత పరీక్షలలో బాగా రాయని వాళ్లందరినీ మందబుద్దులుగా జమకట్టాల్సిన అవసరం లేదు.
8. రిలాక్స అయితే...
పరీక్షలకి చదివే సమయంలో వీలైనంతగా రిలాక్స అవడం ఎంతో మంచిది. సినిమాలు చూసినా, కొంతసేపు టీవీలు వాచ్ చేసినా కూడా బెంగలేదు.
9. ఆదమరచి నిద్రపోతే...
నిదురలోనే మెదడు చదివిన వాటిని తనలో పదిలపర్చుకుంటుంది. ముఖ్యంగా రాత్రి పూట ఈ ప్రక్రియ ఎంతో చురుగా ్గకొనసాగుతుంది. అంచేత ఆదమరచి నిద్రపోవడం కూడా అవసరమే.
10. అదృష్టాదృష్టాలతో....
'కర్మణ్యేవాభికారస్తే.. మాఫలేషు కదాచన' అన్నాడు గీతాచార్యుడు. అంచేత త్రికరణశుద్ధిగా విద్యార్థులు శక్తివంచన లేకుండా తమ కృషి తాము చేస్తే ఖచ్చితంగా వాళ్ళని దేవుడు మెచ్చితీరతాడు. అంతేకాక, అదృష్టం కూడా కచ్చితంగా వాళ్లని వరించి తీరుతుంది. అంచేత, పరీక్షలు రాయడానికి వెళ్లే విద్యార్థులకి 'బెస్టాఫ్ లక', 'గుడ్లక' చెప్పడం మన కనీస ధర్మం. ఏటేటా కోటానుకోట్ల విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్కి, ఐఐటిజి, క్యాట్, మ్యాట్ వంటి పరీక్షలకీ హాజరవుతున్నారు. అంతేకాక, నేషనల్ టాలెంట్ సర్చ్ అనే జాతీయ స్థాయిలోని మరో పరీక్ష కూడా వుంది.ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టా త్మకమైన సర్వీసులకి కూడా ఎంతో గిరాకీ వుంది. ఐతే వీటన్నిటికీ పరీక్షలు కచ్చితంగా రాసి తీరాలి.
కనుక పరీక్షల పేరు చెప్పగానే దిగులూ, బెంగా పడకుండా 'వావ్! ఇది పరీక్షా సమయం' అనుకుని హాయిగా, ఆనందంగా గడపడం అందరికీ ఆరోగ్య దాయకం..
గమ్యం ముఖ్యం:
గమ్యం అంటే చేరాల్సిన స్థానం అని మీకు తెలుసు కదూ! జీవితానికి ఒక లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. అందరి స్వభావాలు, మనస్త త్వాలు ఒక రీతిలో వుండవు. స్థితిగతులు భిన్నంగా వుంటాయి. ఎదు రయ్యే పరిస్థితులు అంతకంటే విభిన్నంగా వుంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కొకరి ఆలోచనలు, అభిరుచులు ఒక్కోలా వుంటాయి. ఏదేమైనా ఎవ రికి తగ్గట్టు వారు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఆ దిశగా ముందుకు సాగాలి.
ప్రతిదానికీ ఒక అనుకూల సమయం అంటూ వుంటుంది. ఆ సమయం మించిపోకుండా చూసుకోవాలి. మీరు భవిష్యత్తులో ఏ వృత్తిలో కొనసాగాలనుకుంటున్నారో ఇప్పుడే నిర్ణయిం చుకోవాలి. ఇందులో పెద్దవాళ్ళ సహకారం తీసుకోవచ్చు. అయితే సొంత అమ్మానాన్న లైనా సరే, కేవలం వాళ్ళు చెప్పారు కదాని.. ఆ వృత్తి లేదా ఉద్యోగాన్ని కొనసాగించాలనుకోవడం మాత్రం సరికాదు. మొట్టమొదట మీకు అం దులో గొప్ప అభిరుచి వుండాలి. ఆపైన పరి స్థితులు ఎంత అనుకూలిస్తాయో చూసుకోవాలి.
చాలాసార్లు పెద్దవాళ్ళు తమకి ఇష్టమైన కోర్సును పిల్లలతో చదివించాలనుకుంటారు. పిల్లల అభిరుచి కూడా ఒకటే అయితే పేచీ లేదు. కానీ, బలవంతంగా చదివించినట్లయితే మాత్రం వాళ్ళు అందులో అంతగా రాణించ లేరు. అదే ఇష్టమైన రంగమైతే కష్టమనిపిం చదు. భవిష్యత్తులో అంకితమైపోయి పని చేస్తారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే కావాల నుకుంటే కష్టం. గ్రాఫిక్ డిజైనర్ల దగ్గర్నుంచి కారు మొకానిక్ వరకూ, ఫైనాన్స్ బిజినెస్ దగ్గ ర్నుంచి, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ వరకూ లెక్కలేనన్ని వృత్తి ఉద్యోగాలున్నాయి. వాటిల్లో మీకు నచ్చినదాన్ని ఎన్నుకున్నట్లయితే అందులో అంకితమైపోయి పనిచేసి బాగా పేరు తెచ్చుకోగల్గుతారు.
ఇకపోతే ఎన్నుకున్న అంశంలో ఫలానా స్థాయికి చేరాలనుకున్న ప్పుడు మన శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. దాన్ని సాధించడంకోసం వీలై నంత ఎక్కువ కష్టపడతాం. చిత్తశుద్ధితో పనిచేస్తాం. మెలకువలో, నిద్రలో కూడా దాని గురించిన ఆలోచనలు సాగుతుంటాయి. ఏ పని చేస్తున్నా మన ధ్యాస, గురి అక్కడే కేంద్రీకృతమై వుంటాయి. ఒక లక్ష్యమంటూ లేకపోతే గాలివాటు ప్రయాణంలో ఎటో ఒకవైపు సాగిపోతాం.
అతి చిన్న విషయం చూడండి.. మీరు క్లాసులో ఫస్ట్ రావాలను కున్నారనుకోండి.. ఎప్పుడూ మొదటి మూడు ర్యాంకులు ఎవరు తెచ్చు కుంటున్నారు.. వాళ్ళెంత చురుగ్గా ఉన్నారు.. మీరు ఎందులో వెనకబడి ఉన్నారు.. లాంటివన్నీ పోల్చి చూసుకుంటారు. ఎక్కువ మార్కులు రావడానికి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుని, ఆటలకు కేటా యించే సమయం కొంచెం తగ్గించి పట్టుదలగా చదు వుతారు. అంత శ్రద్ధ తీసుకున్నాక మంచి మార్కు లు రాకుండా వుంటాయా?! అదే మీరు అలాంటి లక్ష్యం ఏమీ పెట్టుకోకపోతే ఏదో మామూలుగా పాపైపోతారు.
కేవలం చదువు, కెరీరే కాదు.. మనం లోకాన్ని చూస్తూ పెరుగుతాం. మనం విన్న, చూసినవాటిల్లో మనసుకు నచ్చన పనులేవో మనమూ చేయాలనుకుంటాం. కిరణ్బేడీనే చూడండి.. చిన్నతనంలో ఒక అన్యాయాన్ని చూసి చలించిపోయింది. అలాంటివాళ్ళను శిక్షంచి, అమా యకులను కాపాడే శక్తి పోలీసులకే వుంటుంది కనుక, తాను పోలీసాఫీసర్ కావాలనుకుంది. అందుకోసం ప్రయత్నించింది, చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఐ.పి.ఎస్. అధికారి అయ్యింది. కనుక, మీకు నచ్చిన వ్యక్తులను ఆదర్శంగా నిలుపుకోండి. అప్పుడు మనం ఏం చేయాలో మనకు బోధపడ్తుంది.
మహాత్మాగాంధీ, మదర్ థెరిసా లాంటివాళ్ళు మనకు ఆదర్శం. బక్కపల్చగా వుండే మహాత్ముడు సహాయ నిరాకరణతో, అహింసతో బ్రిటిష్ వారిని తరిమికొట్టాడు. ఇక మదర్ థెరిసా దేశం కాని దేశంలో మురికివాడలను ప్రక్షాళన చేయడానికి నడుం బిగించింది. దిక్కూమొక్కూలేని అనాథలను అక్కున చేర్చుకుంది. ఎలాంటి బెరుకు, సందేహం లేకుండా కుష్టురోగులను చేరదీసి సేవ చేసింది. అలాంటి మహనీయులు కోట్లాదిమందికి ఆదర్శం.
బ్రతుకుతెరువు కోసం చేసే ఉద్యోగంలోనే కాదు సమాజానికి పనికొచ్చే ఏదైనా మంచి పని చేయడంలో కూడా ముందుండేందుకు ప్రయత్నించాలి. అందులో ఒక ఒక మైలు రాయి పెట్టుకుంటే, అది చేరడానికి గట్టిగా ప్రయత్నిస్తాం. అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అందులో ఎదురయ్యే ఇబ్బందు లేమైనా వున్నా, వాటినెలా దాటాలో ఆలోచి స్తాం. కనుక, బాలలూ! మీ లక్ష్యం ఏమిటో తెలుసుకుని, నిర్ణయించుకోండి. దాన్ని చేర డానికి అవసరమైన కృషి చేయండి. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తోడ్పడేందుకు ఇంట్లో పెద్దవాళ్ళు, బయట స్నేహితులు వుండనే వుంటారు. ఇంకెందుకు సందేహం.. హాయిగా ముందుకు సాగండి.
పొగడ్తలకు పొంగిపోకండేం!
ఒక అడవిలో అందమైన కొలను ఉండేది. ఆ కొలను చుట్టూ రకరకాల మొక్కలూ, పొదలూ ఉండేవి. ఆ పొదల్లో ఓ పాము పడగవిప్పి అటూ ఇటూ పరిసరాలని చూస్తుండగా కొద్ది దూరంలో ఓ చిరుకప్ప గంతులేస్తూ కనిపించింది. చూడముచ్చటగా ఉన్నాయి ఆ చిరుకప్ప గంతులు. చిరుకప్ప ఈ వేళ ఆహారం అయితే ఎంత బావుణ్ణు! అనుకుంది మనసులో పాము. చాలాసేపు అలాగే పాము పడగ విప్పి ఆ చిరుకప్ప పిల్లి మొగ్గల్ని చూస్తూనే ఉండి పోయింది.
కొద్దిసేపటికి 'చిరుకప్పగారూ...' అని పిలిచింది పాము.
'ఆ... ఏమిటి' అంది చిరుకప్ప గెంతటం ఆపి.
'మీ అమ్మగారు లేరా.. నీవు భలే హుషారుగా గంతు లేస్తుంటే చూడముచ్చటేస్తోంది. నీ గంతుల్ని చూసే కొద్దీ చూడబుద్ధవుతోంది..' అని పాము ఆ చిరుకప్పను పొగి డింది.
'మా అమ్మగారు కొలన్లోకి ఆహారం కోసం వెళ్ళింది.. నేను సరదాగా ఇలా గంతులేస్తున్నాను.. నా గంతులు నిజం గా బావున్నాయా' అని అడిగింది అమాయకంగా!
'నేనింతవరకూ ఇలాంటి గంతులేసే చిరుకప్పని చూడలేదంటే నమ్ము... ఆహా ఏమి గంతులు.. దూరం నుంచి చూస్తుంటేనే ఎంతో బావున్నాయాయె! ఇక దగ్గరనుంచి చూస్తే ఇంకెంతబావుంటాయో! అయినా నాకా అదృష్టం లేదులే! ఎందుకంటే నేను నీ దగ్గరికి రాలేను. మొన్న నా వీపుమీద ఓ పెద్ద బండరాయి పడి వెన్నుపూస విరిగింది. ఎక్కడికీ పోలేక ఇక్కడే కాల క్షేపం చేస్తున్నా'నంది పాము.
'అయితే నా గంతులు నీకు నిజంగానే బాగా నచ్చినట్లున్నాయి. ఉండు నీ దగ్గరగా వచ్చి మరిన్ని గెంతుల్ని నీకు చూపుతాను' అందా చిరుకప్ప అమా యకంగా.
'ఆహా! ఏమి నా అదృష్టం... నా పాచిక పారబోతోంది.. నేను వేసిన ఎత్తు ఫలించబోతోందన్నమాట! అయితే నాకీ రోజు విందుభోజనమే!' అనుకుంది మనసులో పాము.
పాము కుతంత్రాన్ని గ్రహించని అమాయకపు చిరుకప్ప పాము దగ్గరగా వచ్చి గెంతూతూ తన నేర్పును ప్రదర్శించ సాగింది. చిత్ర విచిత్రంగా గెంతులేయడం మొదలుపెట్టింది. పాము మరింతగా చిరుకప్పను పొగుడుతూ మెల్లిమెల్లిగా దగ్గ రకు రాసాగింది. పాము పొగడ్తలకు పొంగిపోయిన చిరుకప్ప గెంతీ గెంతీ అలసటతో సొమ్మసిల్లి పడిపోయింది. పాము మెల్లగా పాకుతూ దాన్ని గుటుక్కున మింగేసింది.
చూశారా బాలలూ... ఎపðడూ పొగడ్తలకు ఉబ్బి తబ్బిబ్బ వ్వకూడదు. అదేపనిగా పొగిడేవాళ్లని అసలు నమ్మరాదు. పాము పొగడ్తలకు చిరుకప్ప ఎలా బలై పోయిందో అర్థమైంది కదా! కనుక ఎపðడూ పొగిడేవాళ్లని నమ్మకండేం!
>(((:> దుర్గేష్ పట్టేం<:)))<
నెత్తుటి బొట్లు:
* ''నా భర్త ప్రతిరోజు ఇక్కడే రాత్రి సమయంలో తాగేవాడు. పిల్లలు చూస్తే చెడిపోతారని మద్యం తాగేప్పుడు జాగ్రత్తలు పాటించేవాడు'' చెప్పింది. ఆ మాటలకు పెదవి విరిచాడు.రాణి, ముఖేష్, రంజిత్ కోసం వెతుకులాట ఆరంభమైంది.రెండు వారాల్లో మొత్తం వారి ప్లేసులన్నీ జల్లెడపట్టి వెతికి తీసుకుని వచ్చారు.
పోస్టుమార్టమ్ రిపోర్టువస్తే ఏదైనా తెలిసేది. గోపాల్(43) హత్యలో మనం అనుమానించే వ్యక్తుల ప్రత్యక్షప్రమేయం లేదు. వారు పిలవగానే వచ్చారు. వారిని ఇంటరాగేట్ చేశాం. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ రాత్రే గోపాల్ను బెడ్రూమ్లోఎవరో చంపేశారు. హంతకుడు ఏ ఒక్క ఆనవాలునూ వదిలిపోలేదు. పోలీస్డాగ్సు సిటీ అంతా తిప్పితిప్పి వెనక్కి తెచ్చేశాయి. గోపాల్తో వ్యాపార లావాదేవీల్లో బాగా గొడవలు పడుతున్న వారెవరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు లేరు. పోనీ డబ్బుకోసమే ఈ హత్య జరిగిందంటే ఆ ఇంట్లో ఏమీ పోలేదు'' పైఅధికారికి విపులంగా వివరించాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరూప్.
అక్కడ మరికొంతమంది అధికారులు ఆసక్తిగా విన్నారు.
''ఓకే మీరు కేసు స్టడీలో బాగానే ఉన్నారు. కాస్త ముందుకు వెడితే మొత్తం మన చేతికి వస్తుంది. ఆ ఇంటి స్టోర్ రూమ్కున్న మూడు మెట్లమీద రెండు నెత్తురుబొట్లు లభించాయి. ఎండిన నెత్తురు మరకల్లో ఒక నెత్తురుబొట్టు హతుడు గోపాల్ది, మరో నెత్తుటిబొట్టు వేరెవ్వరిదో తేలలేదని చెప్పారు. ఒకసారి ఆ దిశలో పరిశోధించండి. ఏది ఏమైనా హంతకుణ్ణి పట్టుకుని తీరాలి. గోపాల్ ఒక కీలకవ్యక్తి''
స్వరూప్ అక్కణ్నించి నేరుగా గోపాల్ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లోవారు ఏది అడిగినా చెప్పడానికి ఉత్సాహంగానే ఉన్నారు. స్టోరురూమ్ మెట్ల దగ్గర ఆగాడు. అక్కణ్నించి పరిసరాలను పరీక్షగా చూశాడు.
అనుమానంగా కలియతిరిగాడు. ఇక్కడే ఏదో జరిగింది ఏమిటది? స్వరూప్ ఆలోచిస్తూ అక్కడ కూర్చున్నాడు. గోపాల్ మృతదేహంపై గొంతులో గాయం ఉంది. బాగా రక్తం కారిపోయింది. అది జరిగింది లోపల బెడ్రూమ్ దగ్గర. మరి ఇక్కడికి రెండు నెత్తురుబొట్లు ఎలా రాలి పడ్డాయి? హంతకుడి చేతిమీద గాయం అయిందనుకుంటే ఒక నెత్తురుబొట్టు మెట్టుమీద పడిందనుకుంటే ఇక్కడికెందుకు వచ్చారు?
స్టోరురూమ్లో మంచం చూశాక దగ్గరగా వెళ్లాడు. అది బాగానే ఉంది. కావాలని పనికిరాదని పడేశారు. తలగడ దిండు మరీ బాగుంది. స్టోరురూమ్లో ఫ్యాన్ ఎందుకో అర్థం కాలేదు. ఆలోచిస్తూనే బయటికి చూశాడు. స్టోరురూమ్కి అవతల పక్కింటివారి పెరటి తలుపుంది. అక్కడికి వెళ్లి అందులో ఎవరుండేది తెలుసుకున్నాడు. వాళ్లు గోపాల్ హత్య తరువాత ఊరెళ్లారు. రెండు కుటుంబాలకు మంచి స్నేహం ఉందని తెలుసుకున్నాడు.
గోపాల్ భార్యను పక్కకు తీసుకుపోయి ఆ ఇంటివారి గురించి అడిగాడు. ''ఆమె పేరు రాణి. మాతో స్నేహంగా ఉండేవారు. ఆమెపై భర్తకు అనుమానం ఎక్కువ. ఆమె అందంగానే ఉంటుంది. గోపాల్హత్య అయిన రోజు ఉదయాన్నే పాట్నా వెళ్లారు. వారి గురించి ఎందుకు అడుగుతున్నారు?'' ఎదురు ప్రశ్నించింది.
గోపాల్, రాణితో మాట్లాడేవారా? చనువుగా ఉండేవారా? నిజమే చెప్పండి. ఏదీ దాచకండి''
''ఆ ఇద్దరిమధ్య ఏదో ఉందని ఆమె భర్తకు అనుమానం. ఒకసారి గొడవపడ్డాడు. నన్ను హెచ్చరించాడు. చంపేస్తానన్నాడు''
''అతడే గోపాల్ను చంపేశాడేమో?''
''రాణి భర్త ముఖేష్ చాలా నీరసంగా ఉంటాడు. అతడి చేతిలో నా భర్త ఏ పరిస్థితిలోనూ చావడు. ఎందుకంటే అతడికి ఏదో రోగం ఉంది. నిలబడలేడు. పరువుకు పడి ఛస్తాడు. నా భర్తను పిస్తోలుతో హత్య లేదు. కత్తితో పొడవగా చనిపోయాడు''
''వారింటికి తరుచూ ఎవరైనా వచ్చేవారా?''
''రాణి అన్న రంజిత్ వచ్చాడు''
''అతడెలాంటి వాడు?''
''తెలియదు. కానీ, ఎప్పుడో మాటల సందర్భంలో రాణి చెప్పింది. అన్నదమ్ములు పెద్దరికంతో పాట్నాలో రాజకీయాలు చేస్తుంటారు. ఆ రాజకీయాలు కూడా పరమక్రూరంగా ఉంటాయి. వారు హత్యలు చేయడానికి వెనుకాడరని''
ఆమెను స్టోరురూమ్లోకి తీసుకుపోయి అక్కడ ఫ్యాన్, పాత మంచం చూపించి వీటిని ఇక్కడ ఎవరు వాడుతున్నారని అడిగాడు. అమె ఆర్థం కాక చూసింది.
''నా భర్త ప్రతిరోజు ఇక్కడే రాత్రి సమయంలో తాగేవాడు. పిల్లలు చూస్తే చెడిపోతారని మద్యం తాగేప్పుడు జాగ్రత్తలు పాటించేవాడు'' చెప్పింది. ఆ మాటలకు పెదవి విరిచాడు.
రాణి, ముఖేష్, రంజిత్ కోసం వెతుకులాట ఆరంభమైంది.
రెండు వారాల్లో మొత్తం వారి ప్లేసులన్నీ జల్లెడపట్టి వెతికి తీసుకుని వచ్చారు.
ముఖేష్ తను ఎందుకు నేరం చేయించాల్సివచ్చిందో ఒప్పుకున్నాడు. అలా చేయకుంటే తనకు శాంతి లభించేదికాదు.
రాణికి డబ్బుపిచ్చి. ఆమె ప్రతిరాత్రి పెరట్లోంచి నేరుగా స్టోర్ రూమ్కి వెళ్లిపోయేది. గోపాల్ ఆమెను దొంగనోట్లను మార్చేందుకు వాడుకున్నాడు. నా దృష్టిలో పడ్డాక పలుమార్లు ఆమెను హెచ్చరించాను. ఒకసారి గోపాల్కు చెప్పాను. అక్కణ్నించి వారిద్దరు లెక్క చేయలేదు. దాంతో ఆమె అన్నను పిలిపించి ఈ విషయం చెప్పాను. వాడు రెచ్చిపోయాడు. గోపాల్ను ఖతమ్ చేయడానికి నిశ్చయించుకున్నాడు. నేను వద్దన్నాను. 'ఇలాంటివారికి ఇదే సరైన జవాబు' అని హత్య పథకం అమలు చేశాడు. ఆ రోజు గోపాల్ ఫ్యామిలీ అంతా పెళ్లికి వెళ్లింది. వారితో రాణి వెళ్లింది. స్టోర్రూమ్ దగ్గరకు వెళ్లి రంజిత్ తలుపు చప్పుడు చేశాడు. రాణి వెనక్కి వచ్చిందని గోపాల్ మద్యం తాగుతూనే ఆత్రంగా వచ్చాడు. అప్పుడు వాడి దగ్గర దొంగనోట్లు లక్షల్లో ఉన్నాయి. వాడిని పట్టుకుని చావగొట్టి మెట్టుమీద పడేశాడు.
గోపాల్ మైకంలో బాటిల్ పగలగొట్టి రంజిత్ను పొడవబోయాడు. రంజిత్ తప్పించుకుని కత్తితో పొడవబోయాడు. గోపాల్ పరుగెత్తాడు. వెంటపడి బెడ్రూమ్లో కత్తితో గోపాల్ గొంతులో పొడిచాడు. దాంతో గోపాల్ కుప్పకూలాడు. ఇదంతా నేను ప్రత్యక్షంగా చూశాను. తొలుత చంపకుండా చావగొట్టి వదిలేద్దామనుకున్నాడు. రంజిత్చేతికి గాయం కావడంతో తట్టుకోలేక చంపేశాడు''
అక్కడ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మెట్లమీద రెండు నెత్తురుబొట్లు పడకుంటే ఈ కేసు ఇంతత్వరగా ముగిసేది కాదు.రంజిత్ కూడా నేరం ఒప్పుకోవాల్సి వచ్చింది.
మళ్లీ గురి తప్పింది
ఆ రాత్రి నిద్రపోతున్న సాగర్ పక్కనే కూర్చుని ఉన్న వృద్ధుడు తన గుడ్డసంచిలోంచి పిస్తోలు తీశాడు. సన్నగా నవ్వాడు. ''సాగర్ ఆస్తి ఇవ్వరా అంటే ఆధారాలు చూపమంటావా? నాకున్న ఒక్కగానొక్క కన్నుకు ఉన్న చత్వారం వల్ల నిన్ను గురిచూసి కాల్చలేకపోయాను. ఇప్పుడు బయట ఏదో పెళ్లి టపాసులు పేలుతున్నాయి నా పిస్తోలు శబ్దం అందులో కలిసిపోతుంది'' తలకు గురిచూసి కాల్చాడు. డామ్మంది.
''గురిచూసి పిస్తోలుతో కాల్చినా సాగర్కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. వాడెవడో పిస్తోలు గురిపెట్టడంలో తడబాటు పడ్డాడు. కడుపులో దూరిపోవాల్సిన గుండు రాచుకుంటూ దూసుకెళ్లింది. అయినా రక్తసిక్తమైన గాయమైంది. దెబ్బతిన్న మరుక్షణం సాగర్ నేలమీద పడిపోయాడు. హంతకుణ్ణి పట్టుకోలేకపోయాడు. అతడెవరో తెలియకుండా పోయింది'' చెప్పాడు ఇన్స్పెక్టర్. ఎదురుగా నిలబడున్న సబ్ఇన్స్పెక్టర్ ''సార్ హంతకుడి గురి తప్పింది. చాలదగ్గర నుంచే కాల్చాడు. అప్పుడు సాగర్ అసలు కదలకుండా ఉన్నాడంట. హంతకుడికి కాల్చడం కొత్తనిపిస్తోంది. లేకుంటే ఏదో తెలియని గాబరా అతనిలో ఉంది. ఇవన్నీ కాకుంటే అతడికి ఏదో కంటికి పెద్దసైట్ లాంటిదైనా ఉండాలి'' తనవంతు ఏదో ఒకటి చెప్పాలని కాకుండా ఆలోచించి మరీ చెప్పాడు.
''నీవు డిటెక్టివ్ నవలలు చదివి ఇలా తయారయ్యావు. ఇప్పుడు నీవు నాకు చెప్పావే అవేవీ మన పరిశోధనకు ఉపయోగపడవు. చదివే పాఠకుడికి థ్రిల్ కలిగించడానికి అలాంటి కోణాలు వెతుకుతుంటారు ఆ రైటర్స్. నువ్వు పోలీసువి, నీకు అలాంటి డ్రామాలతో కూడిన థ్రిల్లింగ్ కథనాలు వద్దు. నిజజీవితంలో అలా ఉండవు. ముందు కోలుకుంటున్న సాగర్ను కలుసుకుని అతడికి ఎవరెవరు శత్రువులున్నారో కనుక్కుని వాళ్లను మొత్తం వాన్లో వేసుకుని వచ్చావంటే ఇంటరాగేట్ చేసి హత్యాప్రయత్నం ఎవడు చేశాడన్నది కక్కిద్దాం'' అని చెప్పి ఏదో ఫోన్వస్తే అందులో మునిగిపోయాడు.
యస్.ఐ బయటికి వచ్చి తిన్నగా హాస్పిటల్కు వెళ్లాడు.
అక్కడ పలువురు మీడియా వాళ్లు సాగర్ ముందు మైక్లు పెట్టారు.
కోలుకున్న సాగర్ వారికి ఓపిగ్గా చెబుతున్నాడు.
''మీకు ఎవరైనా శత్రువులున్నారా? ఎవరిమీద మీకు అనుమానం?''
''శత్రువులే లేరు. నేనెవరినీ అనుమానించలేను''
''మరి ఎందుకు చంపే ప్రయత్నం జరిగింది''
''పోలీసుల దర్యాప్తులో అన్నీ బయటికి వస్తాయి''
''మీకుగా మీరు ఏమీ చెప్పకపోతే పోలీసులు మాత్రం ఏంచేస్తారు?''
''ఎవరిమీద చెప్పగలను. నాకు ఈ మధ్య నా రక్త బంధువు ఒకరు ఎప్పుడో మా తాతలనాటి ఇంట్లో తనకు హక్కుందని వచ్చి అడిగాడు. నేను కుదరదు అని చెప్పాను. ఒకింత ఘర్షణ అయింది. ఆ చిన్నదానికే నామీద హత్యకు దిగడు. పైగా పెద్ద వయస్సు, అతడికి ఒక కన్నులేదు. ఉన్న కన్నుతో సరిగ్గా చూడలేడు. ఏదో ఆవేశంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని మాత్రం తీవ్రంగా హెచ్చరించాడు''
యస్.ఐ వెంటనే అక్కడ ఉన్న పోలీసులను ''ఇక్కడికి ఒంటి కన్నుతో ఉండే వృద్ధుడెవరైనా వచ్చారా?'' అని అడిగాడు.
''వచ్చాడు. తన బంధువు సాగర్ గురించి వచ్చానన్నాడు. దూరం నుంచి చూశాడు. పాతకాలం నాటి బట్టలు వేసుకున్నాడు''
''ఎక్కడున్నాడు? ఏవైపుకు వెళ్లాడు?'' ''అదిగోండిసార్ అక్కడ కూర్చున్నాడు'' చూపించారు.యస్.ఐ ఆ ఒంటికన్నువాణ్ణి పట్టుకుని మెల్లగా వాన్ వద్దకు నడిపించుకుని వెళ్లి అక్కడ అతడి జేబులు వెతికాడు. ''ఏరు పోలీసు నన్ను వెతకవద్దు. పెద్దోళ్ల వద్ద పలుకుబడి ఉన్నోణ్ణి. ఏ కొండిపాంతానికో బదిలీమీద పోగలవు'' అని గుర్రెత్తిపోయాడు. అతణ్ణి వ్యాన్ ఎక్కించుకుని తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ ముందు నిలబెట్టాడు. విషయం విన్న ఇన్స్పెక్టర్ ''నీకు మరెవ్వరూ దొరకలేదా? కాటికి కాళ్లు జాపుకున్నవాణ్ణి వేసుకుని వచ్చావు. ఇతగాడెందుకు సాగర్ను ఖూనీ చేస్తాడు. పిస్తోలు వెతికినా దొరకలేదని చెబుతున్నావు. అది మార్కెట్లో దొరికే చవకబారు వస్తువు కాదే, ప్రతివాడు ఒక పిస్తోలుతో తిరగడానికి. నీకు డిటెక్టివ్ నవల పిచ్చి బాగా ఉంది. పనంతా చెడగొడుతున్నావు. అతణ్ణి తీసుకుపోయి ఎక్కడ దించమంటాడో అక్కడ దించేరు'' చెప్పి పంపేశాడు.
యస్.ఐ ఉసూరంటూనే వాన్ ఎక్కించుకుని బయల్దేరాడు. ఏమయ్యా డ్యూటీకి కొత్తేమిటి? నేను నీకు చంపేటోడిలా కన్పిస్తున్నానా? సాగర్ నాకు ఎంత కాదనుకున్నా నారక్తసంబంధీకుడు. మా తండ్రి నుంచి వస్తోంది ఆస్తులపోరాటం. సరే ఇక్కడ ఆపేరు, అన్నట్టు ఆసుపత్రిలో ఆ పోలీసులకు చెప్పవయ్యా నేను సాగర్కు సేవలు చేసుకోవాలి'' చెప్పి కిందకు దిగిపోయాడు.యస్.ఐ ఆ వృద్ధుణ్ణే చూశాడు. అతడు అధికారుల దగ్గర నడిచేలా మెల్లగా నడవడంలేదు. వేగంగా ఏదో సాధించేవాడిలా నడుస్తున్నాడు. తాను ఏది చెప్పినా డిటెక్టివ్ నవల పరిజ్ఞానం అంటున్నాడు. 'ఎలా ఈ ఇన్స్పెక్టర్తో' అని తలపట్టుకున్నాడు.
ఆ రాత్రి నిద్రపోతున్న సాగర్ పక్కనే కూర్చుని ఉన్న వృద్ధుడు తన గుడ్డసంచిలోంచి పిస్తోలు తీశాడు. సన్నగా నవ్వాడు. ''సాగర్ ఆస్తి ఇవ్వరా అంటే ఆధారాలు చూపమంటావా? నాకున్న ఒక్కగానొక్క కన్నుకు ఉన్న చత్వారం వల్ల నిన్ను గురిచూసి కాల్చలేకపోయాను. ఇప్పుడు బయట ఏదో పెళ్లి టపాసులు పేలుతున్నాయి నా పిస్తోలు శబ్దం అందులో కలిసిపోతుంది'' తలకు గురిచూసి కాల్చాడు. డామ్మంది. బయట పొంచున్న పోలీసులు గాబరగా లోపలకు వచ్చారు. అప్పటికే సాగర్ మెడచివర గాయమై రక్తం కారసాగింది. అక్కడ పొగలు చూసి ఎవరు కాల్చారా అని చూశారు. బ్యాక్డోర్లోంచి పారిపోతున్న వృద్ధుణ్ణి పట్టుకున్నారు. మళ్లీ గురితప్పింది. ఒంటికన్నుకున్న చత్వారం వల్ల అతడు కాల్చడంలో రెండోసారి గురి తప్పాడు.ఇన్స్పెక్టర్ గాఢంగా నిట్టూర్చి యస్ఐను అభినందించాడు. నీ డిటెక్టివ్ నవలా పరిజ్ఞానం కరెక్టుగానే ఉంది. బాగానే చెప్పావు. సాగర్ మరోసారి బతికి బట్టకట్టాడు. లేకుంటే ఎంత ప్రమాదం? మాటపడిపోయేవాళ్లం. దేన్నీ తక్కువ అంచనా వేయరాదు అని తెలుసుకున్నాననుకున్నాడు ఇన్స్పెక్టర్.
Taken By: >(((:> దుర్గేష్ పట్టేం<:)))<