ప్రేమించుకున్నప్పుడు గుర్తురాని కులం, పెళ్లి అనేసరికి గుర్తురావడం నేటి యువతరంలో వున్న విశేషగుణం. నిజమైన ప్రేమ కులం, అందం, ఆస్థి, హోదా ఏవీ గుర్తించదు. కానీ ఇవన్నీ బేరీజు వేసుకుని మరీ ప్రేమించుకోవడం నేటి ట్రెండ్. ఇందులో యువతరాన్ని తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదనిపిస్తుంది. పెళ్లి చేయాలంటే పెద్దలివన్నీ చూసుకునేగా నిర్ణయిస్తున్నారు. 'ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?!' పిల్లలు ఇవన్నీ గమనిస్తూనే వుంటారు. కాకపోతే కాలేజీలో గుర్తింపుకీ, టైంపాస్... వగైరా వగైరా కారణాలకు గర్ల్ఫ్రెండ్ వుండాలి కనుక ప్రేమ అనే పేరు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. కానీ పెళ్లి చేసుకోవాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. కట్నం కావాలి, అత్తమామలిచ్చే మర్యాదలు కావాలి. అంతకన్నా ఎక్కువ లాంఛనాలు కావాలి. పండక్కీ, పబ్బానికీ బహుమతులు కావాలి. అబ్బో! ఇన్ని కావాలంటే ప్రేమ పెళ్లి కుదిరేపని కాదు! ఇలాగే అనుకున్నాడు విజరు. చెల్లెలి స్నేహితురాలిగా పరిచయమైన అనుపమను 'మనసారా' ప్రేమించేశాడు. నాలుగురోజులు వెంటపడి ప్రేమించానంటే ఇట్టే బుట్టలో పడిపోయింది అనుపమ.
ఇంకేముంది 'మూడు సినిమాలు, ఆరు పార్కులు'గా వారి ప్రేమ వర్థిల్లింది. కానీ పెళ్లనేసరికి కులం, పరువు, ప్రతిష్టలన్నీ విజరు కళ్లముందు గిరగిరా తిరిగాయి. తల్లిదండ్రులను కాదని పెళ్లి జరగడం కుదిరే పని కాదని నిక్కచ్చిగా చెప్పేశాడు. కన్నీళ్లు పెట్టుకుంటే న్యాయం జరిగే రోజులు కావని అనుపమ గుర్తించింది. తల్లిదండ్రులతో కలిసి 'ఐద్వా తిరుపతి లీగల్సెల్' కొచ్చింది. ఇరుపక్షాలనూ లీగల్సెల్ పిలిపించింది. 'తక్కువ' కులస్తురాలు కనుక పెళ్లికి ఒప్పుకోమని అబ్బాయి తల్లిదండ్రులు భీష్మించుకుని కూర్చున్నారు. మా ఇంటికి ఎవరూ రారని, బంధుమిత్రుల్లో పరువు పోతుందని వారి వాదన. లీగల్సెల్ రెండువైపులవారికీ ఓపిగ్గా నచ్చచెప్పింది. చివరికి ఇరుపక్షాలనూ వప్పించింది. వివాహం జరిపించ నిర్ణయించారు. కానీ ప్రేమ అనే వ్యామోహంలో పడి అన్నీ మర్చిపోవడం, మోసం జరగగానే కుళ్లి కుళ్లి ఏడ్చేకన్నా పరిపక్వత నిండిన ఆలోచనలతో నిర్ణయం తీసుకోవడం నేటి యువతులు అలవర్చుకోవాల్సిన లక్షణం.
ఇంకేముంది 'మూడు సినిమాలు, ఆరు పార్కులు'గా వారి ప్రేమ వర్థిల్లింది. కానీ పెళ్లనేసరికి కులం, పరువు, ప్రతిష్టలన్నీ విజరు కళ్లముందు గిరగిరా తిరిగాయి. తల్లిదండ్రులను కాదని పెళ్లి జరగడం కుదిరే పని కాదని నిక్కచ్చిగా చెప్పేశాడు. కన్నీళ్లు పెట్టుకుంటే న్యాయం జరిగే రోజులు కావని అనుపమ గుర్తించింది. తల్లిదండ్రులతో కలిసి 'ఐద్వా తిరుపతి లీగల్సెల్' కొచ్చింది. ఇరుపక్షాలనూ లీగల్సెల్ పిలిపించింది. 'తక్కువ' కులస్తురాలు కనుక పెళ్లికి ఒప్పుకోమని అబ్బాయి తల్లిదండ్రులు భీష్మించుకుని కూర్చున్నారు. మా ఇంటికి ఎవరూ రారని, బంధుమిత్రుల్లో పరువు పోతుందని వారి వాదన. లీగల్సెల్ రెండువైపులవారికీ ఓపిగ్గా నచ్చచెప్పింది. చివరికి ఇరుపక్షాలనూ వప్పించింది. వివాహం జరిపించ నిర్ణయించారు. కానీ ప్రేమ అనే వ్యామోహంలో పడి అన్నీ మర్చిపోవడం, మోసం జరగగానే కుళ్లి కుళ్లి ఏడ్చేకన్నా పరిపక్వత నిండిన ఆలోచనలతో నిర్ణయం తీసుకోవడం నేటి యువతులు అలవర్చుకోవాల్సిన లక్షణం.