U R good Right?,so Enter u r Name.

ss

Hello, null ! Welcome to DURGESH's World

కథలు :




    మామయ్య కథలు:


అనగా అనగా ఒక ఊరిలో మిక్కీ అనే ఒక ఎలుక ఉండేది. అది ఒక రోజు మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి నడుస్తూ వెళ్లింది. రోడ్డు ప్రక్కన ఒక రాయి ఉంటే దానిని తన్నుకుంటూ... తన్నుకుంటూ వెళుతోంది. రాయి ఆగిన చోట నుంచి మళ్లీ మళ్లీ తన్నుకుంటూ నడుస్తోంది. ఒక సారి అనుకోకుండా గట్టిగా తన్నింది. అంతే... ఆ రాయి కాస్తా రోడ్డు ప్రక్కన ఉన్న ఇంటి కిటికీబద్దలు కొట్టుకుని, పెద్ద శబ్ధం చేస్తూ ఇంట్లోకి దూసుకొని పోయింది! మిక్కీ పరుగులంకించుకుంది! ఎవరైనా వెంటపడి కొడతారేమోనని! కానీ ఎవరూ చూడలేదు. పరుగెట్టుకుంటూ ఇంటికి వచ్చి పడింది మిక్కీ.

జరిగింది తలుచుకొని చాలా బాధపడింది. కానీ ఎవరితోనైనా ఈ విషయం చెబుదామంటే భయమేస్తోంది మిక్కీకి. ఏం చెయ్యాలో దిక్కుతోచక ఇంటికి పరుగెట్టుకొచ్చింది. ఇంటికి వచ్చాక ఇక మిక్కీకి భయం అంతా పోయింది. ఎందుకంటే రాయి తనే తన్నిన సంగతి ఎవరూ చూడలేదు గనుక ప్రశాంతంగా ఉంది.

కానీ మిక్కీ మనసులో ఏదో తెలియని బాధ, అపరాధ భావం వెంటాడుతోంది. ఆ రాత్రి నిద్రపోలేదు. మిక్కీ అంతరాత్మలో అలా చేయడం తప్పనిపించింది. చాలా బాధ పడసాగింది. రాత్రంతా మంచం పై కూర్చుని, అటూ ఇటూ తిరుగుతూ ఏం చేయాలా అని ఆలోచించింది.

తాను అలా రాయిని తన్ని, కిటికీ పగులగొట్టి అతరులను బాధపెట్టానని తలుచుకొని సిగ్గుపడింది. చివరికి మనస్సు దిటవుచేసుకొని తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని నిశ్చయించుకుంది మిక్కీ. అలా చేయటం వల్ల ఆ ఇంటి వాళ్లు ఏమైనా అంటారేమోనని భయం మనస్సులో ఉన్నా, ధైర్యంగా వెళ్లి తాను చేసిన తప్పును ఒప్పుకోవాలని నిర్ణయించుకుంది.

ఉదయాన్నే లేచి వాళ్ల అమ్మానాన్నలతో ఈ విషయం చెప్పింది. తాను ఏం చేసిందో, ఎలా పారిపోయి వచ్చిందో పూసగుచ్చినట్టు చెప్పింది. తాను చేసిన తప్పును సరిదిద్దు కోవాలనుకుంటున్నట్లు వారితో చెప్పింది మిక్కీ. ''నేను ఆ కిటికీని బాగు చేయించటం కోసం కొంత డబ్బు సంపాదిస్తానని, స్కూలుకు వెళ్లి వచ్చాక మిగిలిన సమయంలో ఏదో ఒక పనికి వెళతానని వాళ్లమ్మానాన్నలతో చెప్పింది.

మిక్కీ తప్పు చేసిందని వాళ్లమ్మనాన్నలకు తెలిసినా, చేసిన తప్పును ఒప్పుకొని, సరిదిద్దుకోవాలనే తన ఆలోచనను బట్టి వాళ్లకు చాలా సంతోషం కలిగింది. కిటికీ అద్దం పగులగొట్టిన ఇంటికి వెళ్లింది భయపడుతూ. తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పుకొంది. ఆ పగిలిపోయిన కిటికీని బాగు చేయిస్తానని, దానికయ్యే ఖర్చు తానే భరిస్తానని ఆ ఇంటివారితో చెప్పింది మిక్కీ. చేస్తే మంచి పనే చేయాలని, ఖచ్చితంగా ఉండాలని అనుకుంటూ, ధైర్యంగా ఇంటికి వచ్చేసింది మిక్కీ. తప్పుచేసి, ఎవరికీ తెలియకుండా పారిపోయి రావటం మంచి నిర్ణయం కాదు.

కాని ఇప్పుడు వెనుకకు తిరిగివచ్చి, తనలో ఉన్న మంచి గుణాన్ని, ప్రవర్తనను చూపించ గలిగింది. తద్వారా దాపరికం లేని మంచి ప్రవర్తన వెల్లడి చేసింది.

పగిలిపోయిన ఆ కిటికీ అద్దాన్ని బిగించి, దానికయ్యే ఖర్చును చెల్లించింది. మంచి పనులు చెయ్యటం ద్వారా వచ్చే సంతోషం అంతా ఇంతా కాదని పొంగిపోయింది. చేసిన తప్పును ఒప్పుకొని, సరిదిద్దుకోవటం వల్ల వచ్చే ఆనందం తెలిసొచ్చింది మిక్కీకి. తప్పు ఒప్పుకోవటానికి కొంత భయపడినా, సరిదిద్దుకోవటం మంచిది అని గుణపాఠం నేర్చుకుంది మిక్కీ.





                                              జిలిబిలి పలుకుల రామ చిలుకలు:


హాయ్‌ ప్రెండ్స్‌! ఈ వారం మనం అందరం ఎంతో ఇష్టపడే జిలిబిలి పలుకులు పలికే రామచిలుకల గురించి విందామా? ప్రపంచ వ్యాప్తంగా పెంపుడు పక్షుల్లో ముఖ్యమైనవి రామచిలుకలే తెలుసా! ఇవి దాదాపు 350 రకాలు ఉంటాయి. వీటిలో చాలా తేడాలున్నా ఇవి అన్ని ఒకే పోలికలను కలిగి ఉంటాయి. అన్ని చిలుకలు వంకర ముక్కును కలిగి ఉండి, వాటికి పెద్దతల ఉంటుంది. కాళ్లకు నాలుగు వేళ్లుంటాయి. రెండు కళ్లు ముందుకు, రెండు వేళ్లు వెనుకకు ఉంటాయి. పండ్లు, పువ్వులు, మొగ్గలు, విత్తనాలు అలాగే చిన్ని చిన్న పురుగులు వాటి ఆహారం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను రామ చిలుకలు కనబడతాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, మధ్య అమెరికా, దక్షణ అమెరికా దేశాలు చిలుకలు భిన్నంగా ఉంటాయి. చిలుకలు చరిత్రలో చాలా ప్రాధా న్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే చాలా తెలివి గలవి కాబట్టి, రంగు రంగుల్లో అలరిస్తూ, కూనీ రాగాలు తీస్తూ ముద్దు ముద్దుగా మాట్లాడేస్తాయి. పెద్ద పెద్ద చిలుకలైతే దాదాపు 75సం|| పైగా బ్రతుకుతాయి. రామచిలుకలు చాక్లెట్లు తినవు. ఎందుకంటే చాక్లెట్స్‌ వాటి శరీరానికి విషపూరిత మైనవి.

వీటి గూళ్లు రంధ్రాల్లో నిర్మించుకుంటాయి. చెట్టు తోర్రల్లో, రాళ్ల సందుల్లోనూ, గుహల్లోనూ, ఇవి గూళ్లను నిర్మించుకుంటాయి. కొన్ని చిలుకలైతే కర్ర పుల్లలతో గూళ్లు నిర్మించుకుంటాయి.

దాదాపు 90శాతం చిలుకలు పట్టబడి, అమెరికాకు అక్రమంగా ఎగుమతి అవుతున్నాయి. అలాగే ఏటా దాదాపు రెండు మిలియన్ల చిలుకలను అధికారి కంగా అనాధికారికంగా అమ్ముతున్నారు.ఈఒిఊా అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా చిలుకలను బంధించి అమ్మకాలు జరపటాన్ని నిషేధించింది.







అందెల సందడి:


మలయపవనాల గిలిగింతలతో కిసలయించిన నవపల్లవాలు పశ్యంతీ వాక్కులో మాట్లాడుకుంటాయట ఈ సచరాచర సృష్టిలోని సమస్త జీవచరాలకీ తనువైన సంజ్ఞలూ, సంకేతాలూ, భావప్రకటనా విధానాలూ వున్నాయి. వాటినన్నింటినీ ఆంగిక, అభినయాలలో పొదువుకున్నాయి, భారతీయ శాస్త్రీయ నృత్యాలు. ఇక కధాగమనం కోసం, సంగీత గమకం కోసం, ప్రేక్షకుల తమకం కోసం, వాచ్యం చేసి చెప్పాల్సిన వచనాలూ, గీతాలూ కోకొల్లలు. అంచేతే, ''వాచికం సర్వ వాజ్ఞయం...'' అన్నారు భరతముని.

ఈ'వాచికం' అనే నాట్యాంశానికి అర్థం, పేలవమైన పదజాలాలు కావు. సమయ సందర్భానుసారంగా నవరస నిష్యందంగా వెలువడే మనోగత భావనిర్జరులే. అంచేతే, 'వాక్యం రసాత్మకం కావ్యం' అన్నారు. వాజ్ఞయ కోవిదులు. అయితే, గద్యపద్యాలు, నాటకీయతకి అనుకూలంగా వుంటాయేమో కాని, నాట్యాలలో అంతగా రక్తికట్టవు. కనుకనే, మన నాట్యాచార్యులు గీతాలాపనలని అనుసరించారు.
అందెల సందడి

''శివ పూజాపరురాలనురా...'' లాంటి పుంఖాను పుంఖాలైన క్షేత్రయ్య పదాలనీ, ''అదివో అల్లదివో శ్రీహరి వాసమూ...'' లాంటి అసంఖ్యాకమైన అన్నమయ్య గీతాలనీ, నాట్యాలకి అనువుగా మలుచుకున్నారు. అయితే, ఏ భారతీయ శాస్త్రీయ నాట్య సరళులలోనూ, సంభాషణలూ, దీతాలాపనలూ, సాధారణంగా నాట్యకళాకారుల, కళాకారిణుల నోటి వెంట వెలువడవు. నేపథ్యంలో, గాయనీ గాయకులు, జంత్రతంత్రీ వాద్య స్వరలయ బద్ధంగా, గీతాలాపనలు చెయ్యడం సందర్భానుసారంగా వచోవిలాసాల ప్రదర్శించడం, జరుగుతుంది.

శ్రావ్యంగా, శ్రుతిపక్యంగా...

సంభాషణలు సరసంగా, స్వారస్యంగా సాగాలి, గీతాలు మనోజ్ఞంగా, శ్రావ్యంగా, శ్రుతిపక్యంగా ఆలపించాలి. సంగీతం తదనుగుణంగా సమకూర్చుకోవాలి. ఇదంతా ఒక అత్యద్భుతమైన రసవిద్య (అల్కెమీ) లాంటిది రసార్ద్రత నిండాలి. వాక్తను మనస్సులు మమేకమై, ఆంతర్యామికి అనుగుణంగా, అంతరంగం పండాలి. అంతేకాని, యాంత్రికంగా, కర్ణకఠోరంగా వినిపించే గొంతులూ, జంత్రతంత్రవాద్య సంగీతాలూ నాట్య విధానాల మీదే ఏవగింపు కలిగిస్తాయి కూడా. నాట్యాలలో నిరంజనంగా వుండే 'వాచికం' ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.

అప్రస్తుత ప్రశంసలూ, అసందర్భ ప్రసంగాలూ చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయోచితంగా, గాత్ర, వాద్య సంగీత గతులనీ, సంభాషణల సంగతులనీ మార్చుకోగలిగిన పరిపక్వత, పరిపుష్టత వున్న సంగీత వేత్తలు నాట్యాలలో, నేపధ్యం నుంచి, నిర్వాజంగా సహకరిస్తే త్రికరణానందకరమై విలసిల్లుతుంది. ఎలాంటి నాట్యప్రక్రియ అయినా నవ్యనవనీత గీత నీరాజనంగా విలసిల్లుతుంది.

చిద్విలాసమయంగా...
అందెల సందడి

నిజానికి భారతీయ శఎస్త్రీయ నృత్య విధానాలన్నీ సచ్చిదానందస్వరూపుడైన 'నటరాజు'ని అలరించే, చిద్విలాస ప్రక్రియలుగా రూపొందాయి. 'సగుణ బ్రహ్మారాధనలోనే, చతుష్షష్టి కళా రూపాలూ అవతరిస్తాయి కనుక, శివ, కేశవ బేధాతీతంగా, చతుర్వేద ప్రణీతంగా, కొనసాగే భారతీ నాట్యప్రక్రియలని, కాళిదాసాది శ్రీనాధాది సంస్కృతాంధ్ర మహా కవులు కూడా, తమకావ్యాలలో పాత్రచితంగా మలుచుకున్నారు.

అలా చూస్తే కాళిదాసు రచించిన 'మాళవికాశ్నిమాత్రం' నాట్యప్రధాన కథాకధనాంశమే. ఇక తెలుగు కవుల పద్య పాదాలకి అనుగుణంగా, రమ్యాతి రమ్యంగా నర్తించవచ్చు.

''చేర్చుక్కగా నిడ్డ చిన్ని జాబిల్లిచే సింధూర తిలకమ్ము చెమ్మగిల్ల...''
అందెల సందడి

లాంటి పద్యపాదాలని అపురూపరాగయుక్తంగా, వాచికం చేసి, ఆ పద్యపాదాలకనుగుణంగా పాద యుగ్మాలు కదలించవచ్చు. ప్రేక్షకుల హృదయాలలో అమందానందరసానుభూతిని కందళింపజెయ్యవచ్చు.

రసానుభావ భరితంగా...

అసలు, ఏ స్థాయిలోని కళాకారుడికైనా, కవికైనా, రచయితకైనా, సృజనాత్మక శక్తి లోపిస్తే, భావదారిద్య్రం ప్రాప్తిస్తే, వాళ్లకి దేవుడే రక్ష మరి!

భక్తి రసప్రధానంగా...

భక్తిసప్రధానమైన గీతాలనీ, పద్యాలనీ వాచికంచేస్తూ, అంగీకాభినయాలుగా అనువదించుకోవడంలో ఆరితేరిన నృత్య కళాకారులెందరెందరో ఈ పునీత భారతావనిలో అవతరించారు.

''కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం

నాసాగ్రేనవమౌక్తికం కరతలే వేణుం కరేకంకణం

సర్వాంగే హరిచందనంచ కలయన్‌ కంఠేచముక్తావళీ

గోపస్త్రీ పరివేష్టితో విజయ తేగోపాల చూడామణీ''.
అందెల సందడి

లాంటి సుమనోహరమైన శ్రీకృష్ణధ్యాన శ్లోకాలని వాచికంచేస్తూ పండిత పామరజన సభారంజకంగా, అభినయం చేసిన చూపిన అమరనాట్యకళా వేత్తలు మన స్మృతిపధంలో అనవరతం మెదులుతూనే వుంటారు.

''కంటి నదీతటంబు, పొడగంటిని భద్రనగాధి వాసమున్‌

కంటినిలాతనూజ నురుకార్ముక మార్గణ శంఖచక్రముల్‌

కంటిని మిమ్ములక్ష్మణునిగంటి, కృతార్థుడనైతినో జగత్‌

కంటక దైత్య నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ!''

లాంటి, పద్యాలని, ''అదివో అల్లదివో శ్రీహరివాసమూ...'' కంటేకూడా కమనీయ కుహుగీతిలా ఆలపిస్తుంటే, తదనుగుణంగా నర్తించిన నాట్య లలామలెందరో ఈ పవిత్ర భారతధాత్రిలో...

అష్టపదులలో...

ఇక జవ దేవుడి అష్టపదులన్నీ నాట్యాభిసరణీయమైనవే.

''తా విరహే తవదీనా...''

''ధీరసమీరే యమునాతీరే
అందెల సందడి

వసతివనే వనమాలీ...''

లాంటి అపురూపమైన అష్టపదుల వాచికానుగుణంగా నర్తించడం, నిరుపమాన నృత్యకళాకోవిదులకే సాధ్యం ఇక, హనుమానుడిని స్మరిస్తూ,

''యత్రయత్ర రఘునాథ కీర్తనం,

తత్రతత్ర కృతమస్తకాంజలిం

బాష్పవారి పరిపూర్ణలోచనం

భావయామి పరమాన నందనం''

అంటూ, హావభావాలు ప్రదర్శించిన కళావేత్తల జీవితాలు ధన్యమే కదా? ఇలా చెప్పుకుపోతుంటే, భక్తిరసనాట్యవిన్యాసాలని అంతూదరీ వుండదనేది నాట్యకళా నిపుణుల కందరికీ తెలిసిన సత్యమే.

అధ్యాత్మిక తాదాత్మ్యంలో...

భారతీయ శాస్త్రీయ నాట్యకళా విన్యాసాల పరమావధి, అలౌకికానందమే! పారమార్థికమే. పురుషార్థ సాధనమే. సామాజిక నైతిక బోధకమే. నాడు రాజారాధాకు. కనుక 'వాచిక' ప్రక్రియ చతుర్విధ నిట్యాంశాలలో ఎంత సులభమైనదో, అంతే సంక్లిష్టమైనది కూడా!

అందెల సందడి

వాచికానుగుణంగా...

వాచికానుగుణంగా జంత్రతంత్రా వాద్యాల సహకార ప్రక్రియ కూడా అనూచానంగా వస్తున్న సంప్రదాయమే. తాళాలూ, తప్పెట్లూ, మృదంగం, తబలా, సన్నాయీ, సితారా, డోలక (ఢమరుకం) వాయులీనం, కంజీర వంటి వాద్య ఘోషతో భారతీయ నాట్య రూపకాలు ఎంతగానో అందగిస్తున్నాయి. అసలు నట్టు వాంగాలూ, సూత్రధారణలూ, సంగీత వాద్యఘోషల సమన్వయం కోసమే నిర్దేశించిన అంశాలు.

మానసికంగా...

ఇలా వాచిక ప్రక్రియలైన వచన గీత సంగీతాలు నాట్య కళాకారులని మైమరపించి నృత్య విధానంలో విలీనం చేస్తాయి. హావభావాలకీ, మూడ్స్‌కీ ఆహార్యానికీ అలంకారాలకీ తుదిమెరుగులు దిద్దేది వాచికమే.

భావ ప్రకటనలో...

హావభావ ప్రకటన నాట్యా లలో ఎంతో కీలకమైన పాత్ర వహిస్తుంది. ఈ భావాన్నే నాలుగు రకాలుగా వర్గీకరించారు నాట్య కళాకోవిదులు.

1. వైభవం

2. అనుభవం

3. వ్యావిచార భావం

4. సాత్విక భావం.

ఈ భావ ప్రక టనలన్నీ

అందెల సందడి

వాచిక ప్రధానమైన అంశాలే. అంచేతే సంస్కార వంతులైన నాట్యకళా వేత్తలతో సహకరించే గాయనీ గాయకులు జంత్ర తంత్రీ వాద్యవేత్తలూ, ప్రచ్ఛన్నంగా పోషించే పాత్ర ఎంతో విశిష్టంగా నాట్యానికి ప్రత్యేకత సంతరించి పెడుతుంది. అంతేకానీ, ఏదో మొక్కు బడిగా పాటలూ, వాద్య సంగీతం సమకూర్చినంత మాత్రాన ఏ నాట్య కళ కూడా సంపూర్ణత సంతరించుకోలేదు.

సంభాషణా, గాన వైశిష్ట్యంలో...
అందెల సందడి

సహజమైన సంభాషణలూ, శ్రావ్యమైన గీతాలూ నాట్య శోభని ఇనుమడింపజేస్తా యనడంలో సందేహం లేదు. అయితే నిరర్థకమైన సంభాషణలూ, అర్థర హిత మైన అశ్లీల గీత గాన సరళులూ, నాట్య ప్రతిష్టని సన్నగిల్లేలా చేస్తాయి. కనుక నాట్యాలకి అనుగుణ మైన సమున్నత గీత సంగీత వచనాలు సమకూర్చాలి తప్ప, శృంగారం పేరిట అసంబద్ధమైన, అశ్లీలమైన పాటలూ, మాటలూ చొప్పించడం వల్ల పామర జనోల్లాసంగా వుంటుందేవెూకానీ, ఆబాలగోపాలాన్నీ సమానంగా అలరించేస్థాయికి చేరుకోదు ఏ నాట్య ప్రక్రియ అయినా. ఇలా వాచికం నాట్య ప్రక్రియని ఆధ్యాత్మిక పదాంతరాళాలలోకి దూసుకు పోయేలా చేసి 'వాచికం స్వరసుధాసేచకం' అనిపిం చేలా చేస్తుంది.





నా సాహచర్యం నీ జీవనచిత్రంలో క్రొంగొత్త రంగులు నింపిందన్నావు.
నీ కళ్ళలోకి చూస్తే నాపైనున్న అపరిమితమైన ప్రేమ తొణికిసలాడింది.
నాలో నేనే నా సంతోషం చిరునామాని వెతుకుతుంటే నీ రూపు కనిపించింది.
ఇంతకీ నీలో నేనున్నట్టా.. నాలోనే నువ్వున్నట్టా..!?
నేనే నువ్వా.. నువ్వే నేనా.. ఇద్దరం ఒకటేనా.!?
ఏమో.! ఆకాశానికి చందమామ అందమా.. చందమామకి ఆకాశం ఆధారమా అంటే ఏమని చెప్పగలం.?
ఆకాశం, చందమామ ఒకచోట చేరితేనే కదా అసలైన ఆనందం..!

ఆకాశం నుంచి జాలువారి నను తాకీ తాకగానే మాయమవుతున్న సన్నటి వాన తుంపర్లు
నీ మోముపై క్షణంలో మెరిసి మాయమయ్యే దొంగ నవ్వుని గుర్తుకి తెస్తున్నాయి.

నేల మీద మెలమెల్లగా అదృశ్యమవుతున్న మంచు మేట
నీపైనున్న నిన్నటి నా అలకని కూడా కరిగిస్తున్నట్టుంది.

ఇంతలోనే చప్పున మబ్బుల చాటునుంచొచ్చి నను ముద్దాడిన సూర్యకిరణాలు
నీ నులివెచ్చని స్పర్శని జ్ఞప్తికి తెచ్చాయి.

అంతలోనే యీ సూర్యకాంతి, ఆ స్వాతి చినుకులు రెండూ మమేకమై
అంబరాన అందమైన హరివిల్లుని చిత్రించాయి.. అచ్చం మన ప్రేమలాగే..!!



ఉపకారం


ఒక అడవిలో రాగి చెట్టు క్రింద చీమల పుట్టలుండేవి. పిసిని, మిత్ర అనే చీమలు రెండు వాటిలో ఉండేవి. పిసిని చీమ పేరుకు తగ్గట్లుగా చాలా పిసినిగొట్టుది. పగలంతా అక్కడక్కడా తిరిగి సంపాదించుకున్న ఆహారాన్ని ఎవరికంటా పడకుండా, ఎక్కడో మట్టి గొయ్యల్లో దాచు కునేది. మిత్ర చీమ అన్ని చీమలతో కలగలపుగా తిరుగుతూ సరదాగా ఉండేది. ఏ చీమైనా కష్టాల్లో వుంటే, నా కెందుకు లెమ్మని పిసిని చీమ మాత్రం చూసీ చూడనట్లుగా తప్పిం చుకొనేది. అందరితో కలిసి,మెలిసి తిరగాలంటే పిసిని చీమకు భయం. ఎక్కడ తను దాచుకున్నఆహారం ఇమ్మని అడుగుతాయోనని తన బొరియలోనుంచి బయటకు వచ్చేది కాదు. మిత్ర చీమ ఎపðడైనా,ఎవరికైనా ఆహారం దొరక్క పోతే తను సంపాదించిన ఆహారంలో కొంతైనాపెట్టి వాటి ఆకలి తీర్చేది.

ఒకసారి ఉన్నట్లుండి పెద్దవాన వచ్చింది. ఆ వాన నీటికి చీమల పుట్టలన్నీ కొట్టుకుపోయాయి. అయితే పిసిని చీమ పుట్టలోని ఆహారం కొట్టుకుపోలేదు. మిగతా చీమలు వెళ్లి కొంత ఆహారం ఇవ్వమని అడిగాయి. అపðడా పిసిని చీమ ససేమిరా అన్నా ఇవ్వలేదు. 'పైగా ఈ వర్షాకాలంలో నేను ఎలా సంపాదించుకోను' అని కసురుకుంది. అయితే, ఆ చీమలు ఏమీ బాధపడలేదు. మిత్ర చీమతో కలిసి అడవిలో దొరికిన ఆహారాన్ని తెచ్చుకొని తిని ప్రాణాన్ని నిలబెట్టుకున్నాయి. ఇలా కాలక్షేపం చేస్తుంటే, మరోసారి కుంభవర్షం కురిసింది. ఆ వర్షానికి సర్వం కొట్టుకు పోయాయి నీటిలో.పిసిని చీమ నీళ్లల్లో కొట్టుకుపోవడం చూసిన మిగతా చీమలు 'అయ్యయ్యో ఇపðడెట్లా' అన్నాయి. ఒక చీమ వెంటనే, ఆ పిసిని చీమ కొట్టుకుపోయి చావనీ! అన్నది కోపంగా! కానీ మిత్ర చీమ అందుకు కోపపడింది. మన జాతిలో మనకు అలాంటి విభేదాలు ఉండరాదు. పదండి, ఈ రాగి ఆకుమీద నీటి ప్రవాహంలో వెళ్లి ఆ పిసిని చీమను రక్షిద్దామంది మిత్ర చీమ. గబగబా మిత్ర చీమ, మిగతా చీమలు ఒక పొడుగాటి చిన్నని ఎండు రెమ్మని పిసిని చీమ ముందుకు తోసాయి. పిసిని చీమ బ్రతికి పోయానను కుంటూ మెల్లగా ఆ రెమ్మ మీదనుంచి మిత్ర చీమ వున్న రాగి ఆకుపైకి చేరింది. అక్కడున్న చీమల్ని చూసి సిగ్గుపడింది. నన్ను క్షమించండి. ఆ రోజు రవ్వంతైనా ఆహారం మీకు ఇవ్వ లేదు నేను. కానీ, మీరు ఈనాడు నా ప్రాణాన్నే రక్షించారు. ఇక నేనెపðడూ పిసినిగొట్టుగా వుండను. మనమంతా ఐకమత్యంగా వుంటూ కలిసి మెలిసి ఉందామంది పిసిని చీమ. మిగతా చీమలన్నీ మారిన దాని మనసుకు అభినందిం చాయి సంతోషంగా!

చూశారా బాలలూ! ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఉపకారమే! పరులకు ఉపకారం చేస్తే, వాళ్లూ మనకు ఆపదలో ఉపకారం చేస్తారు.

-ఎస్‌. తులసీరామాచారి



నడవడిలో 'తడబాట్లుంటే'

హాయ్‌ చిచ్చర పిడుగులూ! ఏం చేస్తున్నారు? ఇవాళ కాసేపు నన్ను మీ టీచర్‌లా అనుకోండి. స్కూల్లోనే అంటే.. ఇక్కడ కూడా పాఠాలా అని భయపడకండి.. అందరు టీచర్లూ క్లాస్‌ తీసుకోరుగా.. మీకు ఇష్ట మైన టీచర్‌ టెక్స్ట్‌బుక్‌లో ఉన్న అంశాలతో బాటు మీ మనసు కనిపెట్టి మాట్లాడదా?! మీకు అవసరమైన విషయాలు విసుగు కల క్కుండా చక్కగా చెశ్నిళ్ష‘ౌ? అలాగన్నమాట.. ఇంతకీ దేని గురించి చెప్ప బోతున్నానని బుగ్గన వేలు పెట్టుకుని తెగ ఆలోచించబోతున్నారా? అంత అవసరం లేనేలేదు. సస్పెన్స్‌ గట్రా ఏమీ లేకుండా ఒక్కముక్కలో విష యం చెప్పేస్తా.. మిమ్మల్ని మీరు ఎలా పర్‌ఫెక్ట్‌గా తీర్చిదిద్దుకోవచ్చు అనేది ఇవాళ్టి టాపిక్కన్నమాట..

అసలు విషయంలోకి వెళ్ళే ముందు మీకో సంగతి తెలు సా? మనకు అమ్మా నాన్న లు, చుట్టాలు, స్నేహితు లు ఎందరున్నా మనకు మనమే చాలా ఆత్మీ యులం. నిజంగా మన కు మనమే బెస్ట్‌ ఫ్రెండ్‌ అన్నమాట.. ఆ తర్వాతే మరెవరైనా. అంత మాత్రా న మనలో అన్నీ మంచి లక్ష ణాలు ఉన్నట్టు కాదు. ఒక్కో సారి మనలో ఇతర్లు చిరాకు పడే లక్షణాలు, మనకే ఇష్టం లేని గుణాలు కొన్ని వుంటాయి. వాటిన లాగే పెంచుకుంటూ పోతే చాలా మందికి మనం నచ్చకుండా పోతాం. మనని అందరూ దూరంగా వుంచితే భరించగలమా చెప్పండి.. పోనీ.. ఏదో బలహీనతలెమ్మని ఇతర్లు పట్టించుకోకపోయినా.. అవలక్షణాల వల్ల ఏనాటికైనా మనకే ప్రమాదం కదా.. కనుక, ఎప్పటి కప్పుడు మనని మనం చెక్‌ చేసుకుంటూ అనర్థం కలిగించే అలవాట్లు, పొరపాట్లు ఏమైనా వుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించాలి. మారాలనుకుంటే చాలు, మానడం ఏమంత కష్టం కాదు.

మహేష్‌కి గోళ్ళు కొరికే అలవాటుంది. ఎప్పుడో, ఏ గోరు విరిగిన ప్పుడో దాన్ని సమానంగా చేయడం కోసం అతి మామూలుగా నోటితో కొరకడం.. తరచుగా అలా చేయడం.. ఇక అదే అలవాటుగా మారింది. అతనికే కాదు, ఎవరికయినా అలవాటుగా మారేది ఇలాగే. చివరికెప్పుడో అది తప్పని తెలిసినా, ఇక మానుకోవడం చేతకాకుండా పాతుకు పోతుంది. మొక్కగా ఉన్నప్పుడు తుంచేయడం సులువు, కానీ మాన య్యాక ఎంత కష్టం.. ఏదైనా అంతే మరి. అయితే హాని చేసే చెట్టయిన ప్పుడు ఎంత కష్టమైనా పెకలించాల్సిందే తప్పదు.

గోళ్ళు కొరకడంవల్ల అందులో ఉన్న మురికి నోట్లో చేరి హాని చేస్తుంది. గోళ్ళు అణగారిపోతాయి. ఏదైనా ఊడబీకడం లాంటి పనులు చేసేందుకు వీలవదు. ఇవన్నీ తెలిసినా, ఇంకొకరు చెప్పినా మహేష్‌ గోళ్ళు కొరికే అలవాటును మానలేకపోయా డనుకోండి.. అతనలా కొరికే టప్పుడు నీలో బోల్డన్ని మంచి అలవాట్లున్నాయి.. ఈ గోళ్ళు కొరకడం ఒక్కటి మానేశావంటే ఇక నీలో వంక పెట్టేదేమీ వుండదని నెమ్మదిగా చెప్పాలి. విమర్శించకుండా, నిందించకుండా ఇంత మంచిగా చెబితే ఎవ రైనా వినకుండా వుండగలరా? ఎంతోకాలంగా ఉన్న ఆ అలవాటు ఒక్క సారిగా మానలేకపోవచ్చు..అలవాటు కొద్దీ అతని చేతులు నోటి దగ్గరికి వెళ్తున్నాయని గ్రహించినప్పుడల్లా మళ్ళీ మర్చిపోయావా అని సున్ని తంగా వారిస్తూ, మరేదో విషయంలోకి అతన్ని డైవర్ట్‌ చేసినట్లయితే కొన్నాళ్ళలో మహేష్‌ పూర్తిగా మానేస్తాడు.

శ్వేత చాక్‌పీసులు లేదా బలపాలు తింటుందట. వాళ్ళ పెద్ద వాళ్ళు ఎంత కోప్పడ్డా ఆమె ఆ బలహీనతను మానుకోలేకపోతోంది. ఈ అల వాటు బహుశా మీలో చాలామందికే వుండి వుంటుంది కదూ! అసలు అలా ఎందుకు తింటారంటే శరీరంలో కాల్షియం తక్కువైతే అలాం టివి తినాలనిపిస్తుందట. అంటే, ముందుగా మన శరీరంలో కాల్షి యం సమపాళ్ళలో వుండేలా చూసుకోవాలన్నమాట. ఈసారి డాక్టర్‌ గారి దగ్గరికి వెళ్ళినప్పడు ఏయే పదార్థాల్లో కాల్షియం వుంటుందో తెలు సుకుని, వాటిని చక్కగా తిన్నారనుకోండి సగం సమస్య పరిష్కారమైనట్టే. శ్వేత కిప్పుడు కాల్షియం ీఖ”్‌ా| లేకున్నా బలపాలు తింటూనే వుంది. ఓ రోజు వాళ్ళ మామయ్య బలపాలు, మట్టిగడ్డలు తినగా, ఒంట్లో బల్ల ఏర్పడి, ఎదుగుదల ఆగిపోయిన వ్యక్తి గురించి పేపర్లో వచ్చిన వార్త చూపి, ఆమెతోనే చదివించాడు. అంతే, ఆ తర్వాతెప్పుడూ శ్వేత బలపం తినలేదు.

ఇక జగన్‌, జయ, జాన్సన్‌, కల్పన, ఇమ్రాన్‌ అనే తేడా లేకుండా పిల్లలందరూ చాక్లెట్లు మహా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా తింటే అదేం దురలవాటు కాదు. కానీ అదే పనిగా తింటే మాత్రం ఆనక జీవితాంతం విలపించాల్సిందే అంటున్నారు డాక్టర్లు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికో, హడలగొట్టడానికో చెప్తున్న మాట కాదు. చాక్లెట్లు ఎంత తీయగా వుంటా యో అంతకు వందరెట్లు హాని చేస్తాయి. మొట్ట మొదట అవి ఆకలి ని పూర్తిగా హరిస్తాయి. కడుపులో నులిపురుగులు చేరతాయి. దాంతో పాలు తాగాలనిపించదు, అన్నం తినాలని పించదు. ఇక అక్కణ్ణించి సమస్య మొదల వుతుంది. విటమిన్లు తగ్గుతాయి. శరీరానికి అవసరమైన పోషక పదార్థాలేమీ అందక ఎదుగుదల తగ్గుతుంది. అన్ని టినీ మించి పళ్ళు పుచ్చిపోతాయి. డెంటిస్టుల దగ్గరికి పరిగెట్టి సిమెంటు పెట్టించుకోవాల్సి వస్తుంది. అయినా పుల్లటి పదార్థాలు, చల్లటి పానీ యాలు అరుదుగా కూడా తీసుకునే అవకాశం వుండదు. రూట్‌ కెనాల్‌ కూడా దెబ్బతిందో ఇక ఆ పిల్లలు నరకం అనుభవించాల్సిందే. ఇప్పుడు మీరే చెప్పండి.. రుచిగా వుంటాయి కదాని చాక్లెట్లు తిని జీవితాంతం అవస్త పడ్తారా.. లేక తెలివిగా ఆలోచించి ఆ అలవాటును మాను కుంటారా?!

ఇన్ని ఉదాహరణలు చూశారు కదా.. ఇప్పుడు మీకేమనిపిస్తోంది? మనమంతా మామూలు మనుషులం కనుక చిన్నవో, పెద్దవో కొన్ని చెడ్డ అలవాట్లు వుంటాయి. కానీ, అవెంత చెడు చేస్తాయో, వాటివల్ల ఎన్ని అనర్థాలు వుంటాయో తెలిసినప్పుడు తప్పకుండా అలాంటివాటిని వది లించుకోవాలనిపిస్తుంది. చేయాల్సిందల్లా ముందు వాటిని మానాలను కోవడం.. తర్వాత అలా చేయాలనిపించినప్పుడల్లా మరో మంచిపనితో మనని మనం ఎంగేజ్‌ చేసుకుంటే సరి.. తప్పకుండా అందు లోంచి బయటికొచ్చేస్తాం.. అదేం బ్రహ్మవిద్య కాదు..



వేమన శతకం


మిరపగింజ చూడ మీఁద నల్లగనుండు

కొఱికి జూఁడ లోఁన జుఱుకుమనును

సజ్జనులగువారి సారమిట్లుండు

విశ్వదాభిరామ వినురవేమ!

మిఱియపుగింజ మీఁద నల్లగా వున్నా,కొరికితే నాలుక చుఱుక్కుమనును! మంచివారు పెకెట్లుండినను,తఱచిచూచినచో బయల్పడుదురు, అని అంటారు యోగి వేమన


బంగారు మాట!

పిల్లలకు తల్లిదండ్రులు మంచి సలహాలనివ్వగలరు, మంచి మార్గంలో పెట్టేందుకు ప్రయత్నించగలరు, కానీ చివరికి ఒక వ్యక్తి భవిత వారి స్వహస్తాలపైనే ఆధార పడి, రూపుదిద్దుకుంటుంది!

-అన్నే ఫ్రాంక




నాకు చదుకు కావాలి


పరీక్షా ఫలితాలు తెలుసుకోవటానికి స్కూలుకు వెళ్ళింది వర్షిణి, తన మార్కులు చూసుకుని ఆశ్చర్యపోయింది. అందరికంటే తనకే ఎక్కువ మార్కులు వచ్చినందున స్కూలులో మొదటి స్థానం వచ్చింది. బడిలో పిల్లలూ మాష్టర్లూ అందరూ ఆ రోజు ఆమెని చాలా అభినందించి పోగడ్తలతో ముంచెత్తారు. హెడ్‌ మాస్టార్‌ పిలిచి చాలా మెచ్చుకుని, ఇంతటితో చదువు మానవద్దని, ఎలాగయినా సరే ఇంకా పెద్ద చదువులు చదవమంటూ ప్రోత్సహించారు.

చిన్నప్పుటి నుండీ తనకు చదువుపైన శ్రద్ధ ఎక్కువ, బాగా చదువుకుని డిగ్రీ చేసే ఉద్యోగి చెయ్యాలనే కోరిక గాఢంగా ఉంది. కానీ తమ ఉన్నది పల్లెటూరు, అక్కడ ఎలిమెంటరీ స్కూలు వరకే ఉంది. ఇంకా చదవాలంటే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి చదువుకోవాలి. చిన్నతనం నుండీ పెద్ద కుటుంబంలో పుట్టినందున చిన్న వయసు కాబట్టి ఇంతవరకూ చదవనిచ్చారు. ఇక ముందు యుక్తవయస్కురాలైతే, పరదా చాటున ఉండమంటారు కానీ పక్క ఊరికి పంపి చదివించే రకాలు కాదు. అనుకుంటూ ఇంటికి చేరుకుంది.

''అమ్మా... నేను పరీక్ష పాసయ్యానమ్మా.. స్కూలుకు ఫష్టు వచ్చాను. మార్కులు బాగానే వచ్చాయి. ఇంకా పై చదువులు చదవమని మా స్కూలు వాళ్ళందరూ చెప్పారు. మామేష్టార్లు మరీ మరీ చెప్పారు'' అంది.

''చాలా సంతోషం తల్లిd,,,, నీకు మార్కులు చాలా వచ్చినందుకు, కానీ మనది పల్లెటూరు కదా...! సత్సంప్రదాయమైన కుటుంబం, నిన్నిప్పుడు పట్నానికి పంపి చదివిస్తున్నానని తెలిస్తే నన్ను అందరూ ఆడిపోసుకుంటారు. బరి తెగించిపిల్ల అంటూ నిన్ను అవమానిస్తారు. నిన్ను చదివించాలనే కోరిక నాకు చాలా కాలం నుండీ ఉంది. నువ్వెంతో చురుకుగా ఉంటూ అన్నిట్లోనూ మంచి పేరు తెచ్చుకుంటుంటే, నిన్నో చదువుల తల్లిగా తీర్చిదిద్దాలని కలలుకన్నాను. ఏం లాభం? సమాజాన్ని ఎదిరించి ఏమీ చెయ్యలేము కదా''.... అంటూ పిల్లను అక్కున చేర్చుకుంది.

''తల్లి మొహంలోని విచారాన్ని కనిపెట్టిన వర్షిణి డీలా పడింది, అయినా సరే ఎలాగోలాగ ఒప్పించాలని ప్రయత్నించి అమ్మా అన్నయ్య ఎలాగూ తన స్నేహితులతో కలసి పక్క ఊరిలో ఉన్న హైస్కూలుకు వెడుతున్నాడు కదమ్మా...! వాడితో పాటూ నేను కూడా సైకిలుపై వెళ్ళి చదువుకుంటానమ్మా......'' అని బతిమాలింది.

''వాడు మగపిల్లాడు, ఎలా వెళ్ళినా ఫరవాలేదు, వాడి చదువుకే డబ్బుకు కష్టంగా ఉంది. ఇంక నిన్ను కూడా చదివించాలంటే మాటలా....? పోనీ ఎలాగోలాగ చదివించాలన్నా కూడా డబ్బు చాలక ఇబ్బందిగా ఉంది. మగపిల్లాడికి చదువు చెప్పించకపోతే మన కులంలో రాణించలేరు. ఉద్యోగాలే వాళ్ళకి ఆధారం, ఆడపిల్లకయితే సాంప్రదాయాన్ని బట్టి ఆ పిల్లల పనిపాటల్ని బట్టీ చదువు లేకపోయినా పెళ్ళి చేసుకోవటానికి అంగీకరిస్తారు. నా తల్లి కదూ... నీ మనసు కష్టపెట్టటం నాకిష్టం లేదు. మన పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటావు కదా అని నీకు చెపుతున్నాను'' - అంది కూతుర్ని బుజ్జగిస్తూ.

ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చిన వర్షిణి తల్లి మాటలకు భిన్నరాలయింది. తలవంచుకుని లోపలకు వెళ్ళిపోయింది. తనకి వచ్చిన మార్కులు లిష్టు చూసుకుంటూ దిగాలుగా మంచం మీద పడుకున్న కూతుర్ని చూసే సరికి మణమ్మకు హృదయం ద్రవించింది. ఆమె దగ్గరకు వెళ్ళి బుజ్జగిస్తూ బతిమాలి అన్నం తినిపించింది.

నిద్ర లేచిన వర్షిణి సాయంత్రం అన్నగారు ఇంటికి రాగానే ''అన్నయ్యా... ఇవాళ మా పరీక్షా ఫలితాలు తెలిసాయి, నీ కన్నీ ఎక్కువ మార్కులే తెచ్చుకుని స్కూలుకు ఫష్టు వచ్చాను''... అంటూ మార్కులు చూపించింది.

''నువ్వే నయమే... బాగా తెలివైన దానివి కాబట్టి మంచి మార్కులు తెచ్చుకున్నావు. నిన్నింకా చదివిస్తే నన్ను మించిపోతావు'' అంటూ చెల్లెల్ని మెచ్చుకున్నాడు ప్రదీప్‌.

''అన్నయ్యా నాకింకా చదువుకోవాలని ఉందిరా... మామేష్టార్లు కూడా చదువు మానద్దు అని గట్టిగా చెప్పారు. అమ్మేమో వద్దంటుంది. నువ్వయినా చెప్పరా... అమ్మకి నీతో పాటు సైకిలు మీద తీసుకెళ్ళి హైస్కూల్లో చదివిస్తానని, మొదట్లో నీకు కష్టంగా ఉన్నా, తరువాత నేను కూడా సైకిలు తొక్కటం నేర్చుకుని నీకు అలసట లేకుండా నిన్ను సైకిలు పై ఎక్కించుకుని తీసుకువస్తాను. ఇద్దరం కలిసి చదువుకోవచ్చు'' అంటూ హుషారుగా అన్నని బతిమాలింది.

''అలాగేతే ముందు సైకిలు తుడు, మట్టి రోడ్డు మూలాన దుమ్ము పట్టి పోయింది. నువ్వు రోజూ సైకిలు తుడుస్తానంటే అమ్మ వద్దన్నా కాని రోజూ నేను నేర్చుకున్నదేదో నీకు నేర్పుతాను'' అంటూ ఆశ చూపించాడు.

ఇంట్లో ఎక్కడా తన చదువు ప్రసక్తి రాకపోవటంతో స్కూలుకు వెళ్ళి మేష్టారుండా... మీరేమో బాగా చదువుకోమని చెప్పారు. మా అమ్మ అసలు ఒప్పుకోవట్లేదు. ఎలాగయినా చదివించమని మీరు మీ ఇంటికి వచ్చి మా అమ్మను ఒప్పించండీ... అంటూ బతిమాలింది.

''పల్లెటూరు సాంప్రదాయాలు కదా అందుకనే మీ అమ్మ ఒప్పుకోవటం లేదేమో...! అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. నీలాంటి చురుకైన అమ్మాయిని చదువు మాన్పించి ఇంటిపనుల్లో ఇరికించటం నాకూ ఇష్టం లేదు, నా సాయశక్తులా నా ప్రయత్నం నేను చేస్తాను '' అంటూ మణమ్మ ఇంటికి వెళ్ళి ఆమెకి నచ్చచెప్పబోయాడు. ''మీరు చెప్పినది బాగానే ఉంది. నాకూ దాన్ని చదివించాలనే ఉంది. ఈ మధ్య మా పరిస్థితులు మారిపోయాయి, పోలాలున్నా కాని పంటలు సరిగా పండకడబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. పెద్దపిల్ల పెళ్ళి చేసామన్న మాటే కానీ వాళ్ళ రాకపోకలకీ పెట్టు పోతలకీ కొంత ఖర్చులు అవుతోంది. ఏంటో అందరూ ఆడపిల్లకి పెళ్ళి చేసేస్తే కొన్ని బారాలు తగ్గుతాయాంటారు. కానీ ఇంకా రెట్టింపు అవుతాయని తెలుసుకున్నాను. అది చూసే చిన్నమ్మాయిని బాగా చదివించాలనుకుంటున్నాను. పరిస్థితులను బట్టి ఆ పిల్లకున్న అదృష్టానికి అడ్డు పడుతున్నేనేమో అనిపిస్తోది'' అంటూ తన మనసులో బాధ ఆయనతో చెప్పింది.

ఆవిడ ఇచ్చిన కాఫీగ్లాసు అందుకుంటూ మీ పడుతున్న ఇక్కట్లు నాకు తెలిసినదే కదా! ఆయన పోయిన దగ్గరనుండి పాలెగాళ్ళ సాయంతో ఫలసాయం అందుకుంటూ, మాట పోల్లుకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికి మీరంటే చాలా గౌరవం ఉంది. మొదటి నుండీ మీకు బాగా తెలుసున్న వాడిని కాబట్టి ఆ పిల్ల చదువుకోసం పడే తపనని చూపి మనసోప్పక మీ దగ్గరకు వచ్చి అడిగాను. మీరు మరోలా భావించకండి'' అంటూ శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

మేష్టారు చెపితే అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది అనే ఆశతో బాటు నుండి అంతా విన్న వర్షిణి హతాశురాలయింది. ఆమె కళ్ళు శ్రావణమే ఘాల్లాగా నీరు కారుస్తుంటే తన ఆశలు అడుగంటి పోతున్నాయనే బాధతో ఏడ్చి నిద్ర కొరిగింది.

రోజూ లేవగానే శుచిగా తయారయి శ్రద్ధగా సరస్వతీ దేవికి పూజలు చేసి తనని కటాక్షించమని వేడుకునేది. అన్నయ్య చెప్పినట్లుగానే రోజూ వాడి సైకిలు శుభ్రం చేసి కారేజీ సర్ధి అన్నీ అమర్చేది. రాత్రి అందరి భోజనాలు అయ్యాక ఇంటి పనుల్లో నాకు ఎబిసిడిలు రాసిచ్చేసి నువ్వు చదువుకోరా... నేను అవిదిద్దుకుంటా కూర్చుంటాను అని అడిగేది.

'' ఉండవే ఇవాళ నాకు స్కూల్లో చాలా చెప్పారు. అవన్నీ బాగా చదవాలి అంటూ తలెత్తకుండా చదువుకుంటూ కూర్చునేవాడు. తను పలక ఒళ్ళో పెట్టుకుని అలానే నిద్ర పోయేది. తన చదువు అయ్యాక చెల్లెల్ని చూసి'' అయ్యో ఇక్కడే నిద్రపోయావా...? మర్చిపోయానే రేపు తప్పకుండా నేర్పుతాను''.. అనేవాడు.

మర్నాడు వాడి పుస్తకాలన్నీ వెతికింది. ఇంగ్లీషు అక్షరాలు పుస్తకం దొరికితే ఆ పుస్తకాలోవి పలకపై రాసుకుని బట్టీ పడేదామని, ఆ పుస్తకం మటుకు దొరకలేదు. అన్నయ్య తన చదువు ధ్యాసలో పడి చెల్లెలు సంగతి మర్చిపోయేవాడు. ఒకరోజు గురువుగారి ఇంటికి వెళ్ళి మీరు స్కూలంతటికీ పెద్దవారు కదా! మీరు బాగా చదువుకునే ఉంటారు మీకు తప్పకుండా ఇంగ్లీషు వస్తుంది. మా అమ్మని బతిమాలి వారానికోసారన్నా మీ ఇంటికి వస్తాను. నాకు చదువు నేర్పండీ'' అంటూ బతిమాలింది.

ఆ పిల్లకి చదువు కావాలనే పట్టుదల ఉండటం చూసి ఆర్ధ్రతతో హృదయం ద్రవించగా ''పాపా మా రోజుల్లో కూడా చదువుకునే అవకాశాలు చాలా తక్కువ నేనూ నీలాగే చదువుకోవాలనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు దక్కనందువల్ల నేను ఈ చిన్న స్కూల్లో ఈ మాత్రంగా రాణించగలిగాను. నువ్వు ఒక పనిచెయ్యి. కొత్తగా సాహితీ వేత్తల కధల పుస్తకాలూ నవలలూ పెట్టారు. అదీ కాక పేపర్లు కూడా వస్తున్నాయి. రోజూ అవి తీసుకెళ్ళి ఉన్నది మర్చిపోకుండా అవన్నీ చదివి నీ తెలివి తేటల్ని వృద్ధి పరుచుకో అవకాశం వచ్చినప్పుడు మిగిలిన చదువులకి ప్రయత్నం చేద్దువుగాని'' అంటూ హితభోద చేసి కొన్ని పుస్తకాలిచ్చారు.

నువ్వలా అస్తమానూ చదువుతూ కూర్చుంటే ఎలా..? వంటా వార్పూ ఇంటి పనులూ బాగా చెయ్యటం నేర్చుకోకపోతే ఎలా....? రేపొద్దున్న నీకు పెళ్ళి చెయ్యాలంటే ఈ రోజుల్లో అవే ముఖ్యం అవిరావని తెలిస్తే నిన్ను పెళ్ళి చేసుకుంటానికి ఎవరూ ముందుకు రారు, అంటూ నచ్చ చెప్పింది తల్లి. తల్లికీ పనుల్లో సాయి చేసినట్లుగా ఉంటుందిని భావించి అమ్మని కూర్చోమని తనే మడిగా వంట చెయ్యటం పిండి వంటలూ వగైరాల్నీ నేర్చుకుంది. పన్నెండెళ్ళకే పదిమంది వచ్చినా తడుముకోకుండా రుచిగా అన్ని రకాలు వండి పెట్టి అందరి మన్ననలూ పొందసాగింది.

ఇవన్నీ చూసిన పెద్ద కూతురు ''అమ్మ.. నాకు నెల తప్పింది పిల్లాడితో చేసుకోవటం చాల కష్టంగా ఉంది చెల్లిని పంపిస్తే నాకు కాస్త పిల్లాడిని ఎత్తుకుని పనుల్లో సాయం చేస్తుంది. నువ్వు ఎప్పుడు పంపించమంటే అప్పుడే పంపిస్తాను. ఎలాగూ పురిటికి అక్కడికే వస్తాను కదా'' అంటూ ఉత్తరం రాసింది.

ఆ ఉత్తరం చూడగానే వర్షిణికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అక్కడ బావగారు హైస్కూలులో ఇంగ్లీషు మేష్టారు అందువల్ల తను బాగా నేర్చుకోవచ్చు అనుకుంటూ, అమ్మ అడగగానే అక్క దగ్గరకెళ్ళటానికి ఒప్పుకుని అక్కడికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక ఆమెలో ఉన్న ఆశలు అణగారిపోయాయి. ఇంట్లో పని చెయ్యటం పిల్లాడినెత్తుకుని ఆడించటం. ఆ పిల్లాడు బొద్దుగా లావుగా ఉన్నందున ఎత్తుకోలేక కింద కూర్చోపెడితే, బయ్య మంటూ ఏడ్చి తల నేలకేసి కొట్టుకునేవాడు. వెంటనే అక్క ''వెధవ కానా.... ఎంతసేపు ఎత్తుకోవాలిరా.. అలా ఏడిచావంటే నేల నేసి తొక్కుతాను. అంటూ కాలుపైకెత్తేది. వాణ్నక్కడ కొడుతుందో అనే భయంతో వెంటనే వాణ్ణి చంకనేసుకుని రోడ్డు మీదకు తీసుకువెళ్ళెది.

''అక్కా! బావతో పాటూ నేనూ స్కూలుకు వెళ్ళి చదువుకుంటాను, నాఈడు పిల్లలందరూ వెళ్ళి చదువుకుంటూంటే నాకు చదువుకోవాలని ఉంది. నీకు ఇంటి పనంతా చేసేసి వెళ్ళి, తిరిగి వచ్చాక మళ్ళీ మిగిలిన పనులు చేసే వాడిని ఆడిస్తాను''- ''నిన్ను ఇంటి పని చేసి పిల్లాడిని ఎత్తుకోవటానికి తీసుకువచ్చాను కానీ చదువుకోవటానికి కాదు'' అని కేకలేసేది.

''బావా.. నువ్వు పిల్లలకి ట్యూషను చెపుతున్నావు కదా... నాకు కూడా ఆపిల్లలతో పాటే చదువు నేర్పుతావా...? అని అడుగితే అందుకాయన నీకెందుకే అమ్మాయివి చదువూ... హాయిగా వంటలు బాగా నేర్చుకో మొన్న నువ్వు వండిన బీరకాయ కూర చాలా రుచిగా ఉంది. అంతానేనొక్కడినే తినాలనిపించింది. ఇంక బొబ్బట్లు సంగతం టావా...? ఆ రోజు వేడి వేడిగా తిన్నా మర్నాడు ఇంకా రుచిగా ఉండి, ఇంకో రెండు శేర్లు పప్పుకొని చేయించుకోవాలనిపించింది. నిన్ను కట్టుకునే వాడెవరో కానీ సుష్టుగా తింటూ చాలా సుఖపడతాడు'' అంటూ నచ్చచెప్పాడు.

ఇంకేం చెయ్యలేక పిల్లాడే లోకం లా బ్రతికి వాడిని ప్రాణంతో సమానంగా చూసుకుంటూ, అక్క బావా కలసి అన్నం తింటుంటే తను పిల్లాడిని ఎత్తుకు బుజ్జగిస్తూ, ఆకాశంలో చందమామనూ చెట్ల మీద పక్షులనూ చూపిస్తూ వాడికి అన్నం తినిపించి, తరువాత తను తిని ఇల్లు శుభ్రం చేసి పిల్లాడిని పక్కలో వేసుకుని పడుకునేది.

ఏం అన్నా కానీ, అక్క అంటే తనక ప్రాణం. ఆ పిల్లలంటే మరీ ప్రాణం అలాగే తన పెళ్ళయ్యేలోగా అక్కకి నాలుగు పురుళ్ళకీ చాకిరీ చేసింది. తన చదువు మాత్రం ముందుకు సాగలేదు''. ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్లుగా యుక్తవయస్సు వచ్చాక అమ్మ పెళ్ళి ప్రయత్నాలు చెయ్యటం మొదలు పెట్టింది. అన్నయ్య తను చదువు పూర్తి చేసుకుని సంపాదనలో పడ్డాడు. పెళ్ళి పేరు చెప్పగానే ''అమ్మా అన్నయ్యదూరాన ఉన్నాడు. నేను అక్క ఇంటికి వెళ్ళినా, అప్పుడు అన్నయ్య నీకు తోడు ఉండేవాడు. ఇప్పుడు నేను పెళ్ళి చేసుకు వెళ్ళి పోతే నువ్వు ఒక్కద్దానివే ఉండాలి. రోజులు మారాయి కదా...? మన ఊళ్ళో కూడా హైస్కూలు వచ్చింది. స్కూలుకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చదువుకుని పరీక్షలు రాసి పాసవుతాను. ముందు అన్నయ్యకు పెళ్ళి చెయ్యి. నీకు కొడుకూ కోడలు తోడుగా వచ్చాక నేను తరువాత పెళ్ళి చేసుకుని వెడతాను. నాకోరికా తీరుతుంది. నీ కోరికా తీరుతుంది. ఇలా చెయ్యమ్మా'' అంది.

''సరేలే అప్పటికి నీ వయసు ముదిరితే ఎవరూ పెళ్ళి చేసుకోవటానికి ముందుకు రారు. ఎందుకు పెళ్ళి కాలేదో అంటూ వంద వంకలు పెడతారు. ఇప్పుడు చాలా మంది నిన్ను పెళ్ళి చేసుకోవటానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నువ్వు కాదంటే మా పరువు పోతుంది'' - అంటూ బతిమాలి పెళ్ళికి ఒప్పించింది.

చదువుతల్లిని ఎంత బ్రతమాలి వేడుకుని పూజలు చేసినా ఆ తల్లి కటాక్ష వీక్షణాలు తనపై ప్రసరించనందున, తనకా అదృష్టం లేదనుకుని పెళ్ళికి ఒప్పుకుంది. భర్తయినా చదివిస్తాడేమో అనే ఆశతో.

కట్నకానుక లిచ్చి మగపెళ్ళివారి గొంతెమ్మ కోరికలన్నీ తీర్చి ఆడంబరంగా పెళ్ళి చేశారు. తన వాళ్ళు అన్నీ అయ్యాక చదువు మీద భ్రమ తీరక వాగ్దేవినీ వాణీ దేవినీ అనేక విధాలుగా సరస్వతి ప్రార్ధనలు చేస్తూ ఆమెకున్న చదువు మీద ఉన్న కాంక్షను భర్త ద్వారా అయినా తీర్చుకోవాలనే కాంక్షతో మొదటి రాత్రి భర్త దగ్గర చేరి తన అనునయ వాక్యాలతో మనుసులో ఉన్న మాటను బయట పెట్టింది. ఆమె అందచందాలను ఆస్వాదిస్తూ, ''దీనికింత తపన ఎందుకు? తప్పకుండా చదువుకుందువుగాని, చిన్న వయసే కదా ఈకు, ముందు ముందు ఎన్నో పెద్ద చదువులు చదివే అవకాశం ఉంది నీకు, తప్పకుండా నెరవేర్చుకుందువుగాని''- అంటూ ఆమెను సముదాయించి ఆనందపరిష్వంగంలో ముంచెత్తాడు.

తన కోరిక తీరుతుందనే తాపత్రయంతో ఆయన వచ్చే సరికి పనంతా ముగించుకుని ప్రసన్న వచనంతో భర్తకోసం ఎదురుచూస్తునే కూర్చునేది. ఆయన ఆఫీసులో పని చేసి అలసిపోయి రాత్రి ఆలశ్యంగా వచ్చి భోజనం చేసి సుఖంగా నిద్ర పోయేవాడు. అలసి వచ్చిన ఆయన ముఖారవిందాన్ని చూసి, ఆయన్ని శ్రమ పెట్టడం ఇష్టం లేక, తనకి దొరికిన పుస్తకాలన్నీ చదివి తన తెలివితేటలను విస్తృత పరుచుకుంది. అలా కొన్నేళ్ళు గడిచేసరికి బాబు పుట్టడం వాడిని కాన్వెంటులో చేర్చే సమయం వచ్చింది. ఓ మంచి రోజు చూపి పిల్లాడికి కాన్వెంటులో చేర్పించారు. వెంటనే ఆమెకో ఆలోచన వచ్చింది. పగలంతా ఇంట్లో కాళీగా కూర్చునే కంటే, ఆయనెలాగా ఆఫీసుకు వెడతారు కాబట్టి తనూ పని తర్వగా తెముల్చుకుని బాబుతో పాటు స్కూలుకు వెడితే, అక్కడ ఏ ఆయాగానో చేరి పిల్లలు నేర్చుకునేవే తనూ నేర్చుకుని నెమ్మదిగా పరీక్షలను కట్టి పాసవవచ్చు. అనే ఉద్దేశ్యంతో ఆ స్కూలు యాజమాన్యం వారిని బతిమాలి తనకున్న విజ్ఞానాన్ని ప్రదర్శించి, అందులో ఆయాగా చేరిపోయింది. తనకే సర్టిఫికెట్లు లేనందున.

''మనబ్బాయితో పాటూ నన్నూ స్కూల్లో చిన్న టీచరుగా చేరమన్నారండీ... వాడితో పాటు వెళ్ళి వాణ్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉంటే పిల్లాడ్ని ఎవరయినా ఎత్తుకుపోతారేమో అనే బాధ ఉండదు. దగ్గరుండి వాణ్ని బాగా చదువుకుని ఆటపాటల్లో ఫష్టు వచ్చేలా చేసుకోవచ్చు'' అంటూ భర్తకి నచ్చ చెప్పింది. అలాగే బాబు వెళ్ళి వస్తూ తనూ చదువుకుని పరీక్షలు పాసై అందులోనే చిన్నటీచరుగా ఉద్యోగం సంపాదించి కొడుకుతో పాటు తూ టెన్త్‌ క్లాసు పరీక్ష రాసి మొదటి స్థానంలో పాసయి, అందరి మన్ననలూ పొంది చిన్న తనం నుండీ తనలో నిద్రాణమై ఉన్న కోరికను తీర్చుకుని, పురి విప్పిన నెమలిలా చాలా సంతృప్తి చెందింది వర్షిణి.                                                                                                             దుర్గేష్ పట్టేం


                                                     ప్రేమికుల దినోత్సవం:
భువనోజ్జ్వల -


యువతీ యువకుల శృంగార జీవనపథంలో సుమనందనం ఈ ప్రేమికుల దినోత్సవం. ప్రేమకి ఎవరెలాంటి పరిభాషలు చెప్పినా చివరికి అమరమైనదే 'ప్రేమ' అనే విషయం అందరూ అంగీకరించేదే! అయితే, ఆ పరమ ప్రేమ స్థాయికి చేరుకోవడానికి అపారమైన అనుభవం, అసమానమైన పరిపక్వత మనస్సులో చోటుచేసుకోవాలి. అలా అనుభూతులూ, అనుభవాలూ, అన్నీ గడించేసరికీ, వయసు మీరిపోతుందనే భయం లేదు. 'ప్రేమికుల దినోత్సవం' అంటే, 'వాలంటైన్స్‌ డే' వయో వృద్ధులు కూడా జరుపుకోవటానికి అంతర్జాతీయంగా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవు.

కవర్‌స్టోరీ

అందుకే ఏటేటా ఫిబ్రవరి 14 వ తేదీన 'వాలంటైన్స్‌ డే' అంటే 'ప్రేమికుల దినోత్సవం' ప్రపంచమంతటా వైభవోపేతంగా జరుపుకోవడం ఒక సత్‌ సంప్రదాయంగా పరిణమించింది. అసలీ తతంగమంతా 'సెయింట్‌ వాలంటైన్‌' పేరుమీద జరుగుతోందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ అదే నిజం. అలా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలంతా శృంగారోద్దీపకమై పోయింది.

కవర్‌స్టోరీ

సనాతన సంప్రదాయాలలో...

అటు, క్రిష్టియన్‌ మతాచారాలలో, ఇటు సనాతన రోమన్‌ సంప్రదాయంలో కూడా 'వాలంటైన్స్‌ డే' ప్రసక్తి వుంది. అసలు ఈ సెయింట్‌ వాలంటైన్‌ ఎవరు ఆయనకీ ఈ ప్రేమికుల దినోత్సవానికీ ఉన్న అవినాభావ సంబంధమేమిటి అనే చర్చ అనాదిగా కొనసాగుతూనే వుంది. ఇపðడు కాథలిక చర్చి కనీసం ముగ్గురు సెయింట్స్‌ని వాలంటైన్‌గా లేదా వాలంటినస్‌గా గుర్తిస్తోంది. అయితే వాళ్లంతా ఈ సమాజం కోసం ప్రాణత్యాగం చేసి అమరులైపోయారు.

మరో కథనానుసారం...

సెయింట్‌ వాలంటైన్‌ గురించి మరో కథ కూడా ప్రచారంలో వుంది. మూడో శతాబ్దంలో రోమ్‌ నగరంలో వాలంటైన్‌ అనే ఒక పూజారి వుండేవాడట. క్లాడియస్‌ చక్రవర్తి సైన్యంలో బ్రహ్మచారులనీ, అవివాహితులనీ నియమించాలని నిర్ణయించిన తరుణంలో, ఈ అన్యాయాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు వాలంటైన్‌. అంతేకాక, ఆయన యువ ప్రేమికులకి రహస్యంగా వివాహాలు కూడా జరిపించేవాడు.
కవర్‌స్టోరీ

ఇంకో కథ కూడా రోమ్‌లో ప్రచలనంలో వుంది. రోమన్‌ చక్రవర్తుల చెరసాలలోంచి క్రిష్టియన్స్‌ని తప్పించాలని చూసిన సమయంలో వాలంటైన్‌ చనిపోయి వుండవచ్చని కూడా కొందరు భావిస్తుంటారు.

వాలంటైన్‌ గ్రీటింగ్స్‌లో...

ఇపðడు ప్రేమికులు వయోపరి మితితో నిమిత్తం లేకుండా ఒకరికొకరు గ్రీటింగ్స్‌ పంపుకోవడం, శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనూ చానంగా వస్తున్న సంప్ర దాయం.

కవర్‌స్టోరీ

ఇంకో కథనంలో...

నిజానికి వాలంటైన్‌ ఒక యువతిని ప్రగాఢంగా ప్రేమించా డనీ, ఆయనని బంధిం చిన చెరసాల జైలర్‌ కూతురే ఆమె అనీ, తరచూ ఆమె ఆయ నని కలవడానికి వస్తూవుండేదనీ, చివరికి అవసాన దశలో వాలంటైన్‌ ఆమెకి ఒక లేఖ వ్రాస్తూ, 'ఫ్రం యువర్‌ వాలంటైన్‌' అని ప్రేమపూర్వకంగా సంతకం చేశాడనీ ప్రతీతి. అసలీ కథల నిజానిజాలు ఎలా వున్నా వాలంటైన్‌ ఒక కరుణామయుడైన సాహసో పేతుడైన శృంగార పురుషుడనే విషయం మాత్రం వాస్తవం. అంచేత మధ్యయుగంలో వాలంటైన్‌ ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌లలో కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాడు.

వాలంటైన్‌ సమాధి సూచకంగా....
కవర్‌స్టోరీ

ఏటేటా ఫిబ్రవరి నెల మధ్యభాగంలో వాలంటైన్‌ మృతినీ, సమాధినీ గుర్తుతెచ్చుకుంటూ ఆయన పవిత్ర స్మృతిలో నిర్వేదంగా 'వాలంటైన్స్‌ డే' గడపడం కూడా కొందరి ఆచారం. క్రీ.శ. 270లో వాలంటైన్‌ చనిపోయి వుంటారని విశ్వసిస్తారు. అదే విధంగా, పాగన్‌ లూపర్‌కాలియా ఫెస్టి వల్‌ని క్రిస్టియనైజ్‌ చేయడం కోసం 'వాలంటైన్స్‌ డే' జరుపుకోవడం కూడా కొందరి అలవాటు.

ప్రాచీన రోమ్‌ నగరంలో...
కవర్‌స్టోరీ

పురాతన రోమ్‌ నగరంలో, వసంతకాలం ఆరంభమయ్యే ఫిబ్రవరి నెల పవిత్రతకీ, పారిశుధ్యానికీ సంకేతంగా నిలిచేది. మత సంప్రదాయాలకి అనుగుణంగా ఇళ్లని శుభ్రంగా తుడిచి , కడిగి అలంకరించి ఇల్లంతా ఉపð, గోధుమ పిండీ చల్లీ వసంతాగమనానికి స్వాగతం పలకడం అలనాటి ఆచారమట!

వ్యవసాయ అధిష్టాన దేవత పరంగా...

ఫానస్‌ని రోమన్స్‌ వ్యవసాయ అధిష్టాన దేవతగా భావిస్తారు. అలాగే రోమ్‌ దేశ వ్యవస్థాపకులైన రోమ్యులస్‌ రెమస్లకి కూడా పవిత్ర స్మృత్యంజలి ఘటిస్తూ ఫిబ్రవరి 15 వ తేదీన ల్యూపర్‌కాలియా ఆరంభమయ్యే రోజున 'వాలంటైన్‌ డే' జరుపుకోవడం కూడా రోమ్‌ దేశంలో కొనసాగుతున్న సంప్రదాయమే.

కవర్‌స్టోరీ

ఈ వేడుకలు మొదలుపెట్టేముందుగా రోమన్‌ ప్రీస్ట్స్‌లో సభ్యుడైన 'ల్యూపర్‌సీలు' ఒక అపురూపమైన గుహముందు సమావేశమౌతారు. రోమ్‌ వ్యవస్థాప కులుగా భావించే రోమ్యులస్‌ రేమస్‌లని ఒక ఆడ తోడేలు పెంచి పెద్ద చేసిందనే ఆసక్తికరమైన కథ కూడా వుంది. అలా జరుపుకునే వేడుకలలో రోమన్‌ ప్రీస్ట్స్‌తమ పుంసత్వం కోసం ఒక మేకనీ, పవిత్రత సంతరించుకోవడం కోసం ఒక కుక్కని కూడా బలి ఇస్తారు.

ఆ తర్వాత ఆ మేకని ముక్కలు ముక్కలుగా కోసి పవిత్ర రక్తంలో ముంచి వీధులలో ఊరేగిస్తూ స్త్రీలని పంటపొలాలనీ ఆ మాంసపు ముక్కలతో సున్నితంగా స్పృశిస్తారు. అలా చేయడం వల్ల ఆ స్త్రీలలో వంధ్యత్వం తొలగిపోయి నిండైన స్త్రీత్వం అంకురిస్తుందనీ, అలాగే పురుషులలో నపుంస కత్వం మాయమె ౖపోయి మగసిరి ఉట్టిపడు తుందనీ వాళ్ల అభిప్రాయం.

స్త్రీ పురుష స్వేచ్ఛా సమాగమంలో...
కవర్‌స్టోరీ

వాలంటైన్‌ డే నాడు వావి వరుసలూ, వయో బేధాలూ లేకుండా స్త్రీ పురుషులు సంగమించడం కూడా కొన్ని దేశాలలో ఇప్పటికీ కొనసాగుతున్న వ్యవహారమే. ఈ ప్రక్రియలో పాల్గొనే స్త్రీలందరూ ఒక చిన్ని కాగితం ముక్క మీద తమ పేరు రాసి ఒక కలశంలో (అర్న్‌) లో వేస్తారు. ఆ తరువాత నగరంలోని బ్రహ్మచారులు ఒక్కొక్కరుగా వెళ్లి కలశంలోని చీటీలు తీసి, ఆ చీటిలో వున్న పేరు గల యువతితో ఆ

ఏడాది అంతా కులాసాగా గడుపుతారు. అలా గడిపినవాళ్లు శాశ్వతంగా వివాహబంధంతో పవిత్రమైన దంపతులుగా మారడం కూడా క్రీ..శ. 498 నుంచి కొనసాగుతున్న ఆచారమే. కానీ క్రిష్టియన్స్‌ మాత్రం రోమన్స్‌ కొనసాగించే ఈ శృంగారభరితమైన లాటరీ విధానాన్ని క్రిష్టియన్‌ మతం సమ్మతించదనీ అది చట్టసమ్మతం కాదనీ నిషేధించారు.

పక్షుల సంపర్కదినో త్సవంగా...

మధ్యయుగంలో ఫ్రాన్స్‌లో ఇంగ్లండ్‌లో, ఫిబ్రవరి 14వ తేదీని పక్షు ల సంగమ దినం (బర్డ్స్‌ మేటింగ్‌ డే) గా జరుపుకునేవారు. అసలు డ్యూక ఆఫ్‌ ఆర్లియన్స్‌ ఛార్లెస్‌ వ్రాసిన ఒక కవితలో వాలంటైన్‌ ఇంకా చిరస్మరణీయంగా వుండిపోయాడు. ఆగిన్‌పోర్ట్‌ యుద్ధంలో శత్రువులకి పట్టుబడి టవర్‌ ఆఫ్‌ లండన్‌కి చెందిన చెరసాలలో జీవితమంతా గడిపిన ఛార్లెస్‌ తన భార్యకి 1415లో రాసిన ఉత్తరం ఇప్పటికీ చెక్కుచెదర కుండా ఉంది. అలాగే కింగ్‌ హెన్రీకూడా జాన్‌ లిడ్‌గేట్‌ అనే కవిని ఆదరించి, తన ప్రియురాలు కేథరిన్‌ ఆఫ్‌ వాలోయిస్‌కి ఒక నోట్‌ రాయించుకన్న వైనం కూడా చరిత్రలో వుంది.

కవర్‌స్టోరీ

గ్రేట్‌ బ్రిటన్‌లో...

గ్రేట్‌ బ్రిటన్‌లో 17వ శతాబ్దంనుంచీ వాలంటైన్స్‌ డే జరుపుకుంటున్న ఉదంతాలున్నాయి. స్నేహితులకీ, ప్రేమికులకీ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకీ చేతితో వ్రాసిన శుభాకాంక్షల పత్రాలు అందజేసుకునే ఆచారం ఆనాడు కొనసాగేది. ఆ తర్వాత 18 వ శతాబ్దపు మధ్యకాలంలో ప్రింటింగ్‌ టెక్నాలజీ అవిష్కరించిన తర్వాత ఎంతో ఆకర్షణీయంగా వాలంటైన్‌ డే గ్రీటింగ్స్‌ వెలువడడం మొదలయ్యింది. అలాగే 1700 దశకంలో అమెరికాలో చేతితో తయారు చేసిన వాలంటైన్‌ కార్డ్స్‌ని పరస్పరం అందించుకోవడం అనే సంప్రదాయం కొనసాగేది. 1840లో ఎస్తర్‌ ఏ హౌలండ్‌ అనే వ్యాపారి పుష్కలంగా వాలంటైన్‌ డే కార్డ్స్‌ రూపొందించి అమెరికా అంతా విరివిగా అమ్మడం ఆరంభించాడట.

బిలియన్స్‌ గ్రీటింగ్స్‌తో...

ఇపðడు ఏటేటా ఒక బిలియన్‌ గ్రీటింగ్‌ కార్డ్స్‌ ప్రపంచమంతటా అమ్ముడవు తున్నాయి. నిజానికి న్యూఇయ ర్స్‌డే, క్రిస్‌మస్‌ల తర్వాత ప్రపంచ మంతటా ప్రముఖంగా జరుపుకునే వేడుక వాలంటైన్స్‌డే. ఇంచుమించు 2.6 బిలియన్‌ గ్రీటింగ్‌ కార్డ్స్‌ అమ్ముడవు తున్నాయి.

మహిళల ముందంజతో...
కవర్‌స్టోరీ

మగవాళ్లకంటే స్త్రీలే వాలంటైన్‌ డే జరుపు కోవడానికి ఉరకలేసు ్తన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మాత్రమే కాక కెనడా, మెక్సికో, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా లలో కూడా వాలం టైన్స్‌డే ఎంతో వైభవంగా జరుపుకుంటు న్నారు.

భారతదేశంలో...

ఏ దేశంతో పోల్చి చూసినా అత్యధిక శాతం యువత భారతదేశంలోనే వుందన్న విషయం ప్రపంచమంతటికీ తెలిసిందే. ఈ నవనాగరిక యువతరం కులమతా లకీ, వర్గ వ్యత్యాసాలకీ బానిస కాకుండా స్వేచ్ఛగా తమదైన ప్రేమ ప్రపంచంలో విహరించాలని కోరుకుంటోంది. కొందరు మత దురహంకారులూ, ఛాందసులూ వాలంటైన్‌ డే మన దేశ సంస్కృతికీ, సంప్రదాయానికీ సరిపోదనీ, సంకుచిత భావంతో చివరికి వాలంటైన్‌ డే గ్రీటింగ్‌ కార్డ్స్‌ కూడా పోగులు పెట్టి మంటలు పెట్టినా, ఇంకా భారతీయ యువతరంలో, యువతీ యువకుల హృదయాలలో పవిత్ర ప్రేమానల జ్వాల అంత రించిపోలేద నడానికి నిదర్శనం ప్రేమికుల దినోత్సవం.

పవిత్ర ప్రేమ పేరిట...
కవర్‌స్టోరీ

పవిత్ర ప్రేమ పేరిట యువతులనీ, చివరికి ముక్కుపచ్చలారని బాలికలని కూడా వలలో వేసుకుని వాళ్లమీద అత్యాచారాలు జరిపి, ఆటవస్తువుల్లా ఉపయోగించుకుని చివరకి హత్య చేయడానికి కూడా వెనుకాడని ఈ ధ్వంస రచనా యుగంలో

ప్రేమికుల దినోత్సవం త్రికరణ శుద్ధిగా జరుపుకోగలిగితే యువత జీవితాలు సార్థకమవుతాయి.

వాళ్లు నిజమైన ప్రేమ తత్త్వాన్ని ఆకళించుకోగలుగుతారు. అంతేకానీ, విచ్చలవిడి తనానికీ, విశృంఖల లైంగిక ప్రక్రియలకీ అలవాటు పడడం కాము కత్వం అనిపించుకుంటుందేవెూ కానీ, ప్రేమ మాత్రం ససేమిరా కాదు.అంచేతే నేటి యువతరం ప్రేమ పరిభాషని సవ్యంగా ఆకళించుకోవాలంటే నవయవ్వ నంలోనే తనువు చాలించిన సుప్రసిద్ధ అధి భౌతిక కవియిత్రి (మెటా ఫిజికల్‌ పొయిటెస్‌) ఎమ్లీ డికెన్సన్‌ ప్రేమకి చెప్పిన పరిభాషని గుర్తుంచుకోవాలి.

కవర్‌స్టోరీ

'లవ్‌ ఈజ్‌ యాంటీరియర్‌ టు లైఫ్‌

పోస్టీరియర్‌ టు డెత్‌

ఇనీషియల్‌ ఆఫ్‌ క్రియేషన్‌

అండ్‌ ఎక్సపొనెంట్‌ ఆఫ్‌ ఎర్త్‌'

అన్న అనితర సాధ్యమైన ప్రేమ కవితా పరిభాషని 'ప్రేమికుల దినోత్సవం' అంటే వాలంటైన్స్‌ డే నాడు మననం చేసుకుంటే, అదే ప్రేమ గుండెల్లో నిండితే, మనసులకి పట్టిన మాలిన్యాలు తొలగిపోతాయేవెూ!


ఈ ధ్వంస రచనా యుగంలో

ప్రేమికుల దినోత్సవం త్రికరణ శుద్ధిగా జరుపుకోగలిగితే యువత జీవితాలు సార్థకమవుతాయి.

అంతేకానీ, విచ్చలవిడి తనానికీ, విశృంఖల లైంగిక ప్రక్రియలకీ అలవాటు పడడం కాముకత్వం అనిపించుకుం టుందేవెూ కానీ, ప్రేమ మాత్రం ససేమిరా కాదు.



                                                                                                             ఇట్లు : దుర్గ్గేష్ పట్టేం